News January 27, 2025

జనగామ: ప్రజావాణి ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించరాదు: కలెక్టర్

image

ప్రజావాణి ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించరాదని జిల్లా క‌లెక్ట‌ర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారుల‌ను ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, రోహిత్ సింగ్‌లతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్జీలను పరిశీలించి, వెంటనే పరిష్కరించాలన్నారు.

Similar News

News September 14, 2025

HYD: విద్యార్థినుల ఫోన్ నంబర్లు వారికెలా వచ్చాయి?

image

మహిళా వర్సిటీ విద్యార్థినులను వేధిస్తున్న ముగ్గురు యువకులను సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ ముగ్గురికీ విద్యార్థినుల ఫోన్ నంబర్లు ఎలా వచ్చాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. నిందితుల్లో ఒకరు కార్ డ్రైవర్, మరొకరు హౌస్ కీపింగ్ బాయ్, మరొకరు డెలివరీ బాయ్. అంతమంది నంబర్లను ఎలా సేకరించారనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు.

News September 14, 2025

ఖైరతాబాద్: ‘ఈ నెల 24న బీసీ బతుకమ్మ నిర్వహిస్తాం’

image

ఈ నెల 24న ట్యాంక్ బండ్‌పై బీసీ బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తామని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వేలాది మంది మహిళలు బీసీ బతుకమ్మ వేడుకలో పాలుపంచుకుంటారన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని కోరారు.

News September 14, 2025

ములుగు సమగ్ర స్వరూపంపై పుస్తకం రూపకల్పన

image

తెలంగాణా సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా సమగ్ర స్వరూపం అనే పుస్తకాన్ని వెలువరిస్తుందని నిర్వాహకులు తెలిపారు. జిల్లా చరిత్ర, నైసర్గిక స్వరూపం, నీటిపారుదల, వ్యవసాయం, పర్యాటక, విద్యా, రాజకీయ, ఆధ్యాత్మిక, సామాజిక, కళా రంగాలు, ఇతర అంశాలపై రచయితల నుంచి వ్యాసాలు ఆహ్వానిస్తున్నామని, అమ్మిన శ్రీనివాసరాజు 7729883223, కె. వెంకటరమణ 9849905900లకు వాట్సాప్ ద్వారా పంపాలని కోరారు.