News October 3, 2025

జనగామ: బచ్చన్నపేటలో యాక్సిడెంట్

image

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటలో బొచ్చు క్రాంతి కుమార్ అనే వ్యక్తి వేగంగా కారు నడుపుతున్నాడు. ఇదే సమయంలో బైక్‌పై వెళ్తున్న కందుల అర్జున్(17), శ్రీపతి కృష్ణప్రసాద్‌ను ఢీకొట్టాడు. ప్రమాదంలో అర్జున్ మృతిచెందగా కృష్ణప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Similar News

News October 4, 2025

MBNR: పల్లె పోరు.. ఓటర్ లిస్ట్ UPDATE..!

image

మహబూబ్ నగర్ జిల్లాలో ZPTC,MPTC ఎన్నికలకు ఓటర్ లిస్ట్ తుది జాబితాను అధికారులు ఇప్పటికే విడుదల చేశారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,99,852 మంది ఓటర్లు ఉండగా..పురుషులు 2,48,222 మంది, మహిళలు 2,51,349 మంది ఇతరులు 11 మంది ఉన్నట్లు ఓటర్ లిస్ట్ ఫైనల్ చేశారు. జిల్లా వ్యాప్తంగా పురుషుల ఓటర్ల కంటే 3,127 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

News October 4, 2025

HYD: కిరాతకంగా చంపి.. వాటర్‌ ట్యాంకు‌లో పడేశారు.!

image

మాదన్నపేటలో ఏడేళ్ల బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లో అల్లరి చేస్తుందనే కోపంతో మేనమామ, అత్త కలిసి బాలికను కిరాతకంగా చంపినట్లు తేలింది. చేతులు, కాళ్లు కట్టేసి, నోటికి ప్లాస్టర్‌ వేసి వాటర్‌ ట్యాంకులో పడేశారని పోలీసులు తెలిపారు. బాలిక తల్లితో కొన్నాళ్లుగా ఆస్తి పంపకాల విషయంలో తగాదాలు ఉన్నాయి. ఆస్తి పంపకాల గొడవల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.

News October 4, 2025

₹5కోట్ల ఇన్సూరెన్స్… హత్య చేసి ఆపై క్లెయిమ్ కోసం నాటకం

image

ఓ గ్యాంగ్ ₹5.2కోట్ల ఇన్సూరెన్స్ చేసుకున్న వ్యక్తిని హత్యచేసి ఆ మొత్తం క్లెయిమ్‌కోసం నకిలీ భార్యతో డ్రామా ఆడించింది. పక్షవాతం ఉన్న కౌల్పేట్ (KA)కు చెందిన గంగాధర్‌కు బీమా ఉంది. గమనించిన ముఠా అతణ్ని చంపి బాడీని టూవీలర్‌పై పెట్టి కారుతో గుద్దించింది. ముఠాలోని మహిళతో CLAIM చేయించింది. డెడ్‌బాడీ విషయం తెలిసి పోలీసులు అసలు భార్యను విచారించగా టూవీలర్ లేదని తేలింది. తీగలాగి మొత్తం ముఠాను అరెస్టు చేశారు.