News October 20, 2025
జనగామ: బడుల పర్యవేక్షణకు కమిటీలు

ప్రభుత్వ బడుల్లోని విద్యా వ్యవస్థను పర్యవేక్షించేందుకు విద్యాశాఖ సంచాలకుడు నికోలస్ ఉపాధ్యాయులతో బడుల పర్యవేక్షణకు కమిటీల ఏర్పాటు ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఈ కమిటీలపై జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఉపాధ్యాయులపై ఇప్పటికే అదనపు భారాలతో ఇబ్బందులు పడుతుంటే కమిటీల వల్ల ఇబ్బందులు పెరుగుతాయని సంఘాల బాధ్యులు అంటున్నారు.
Similar News
News October 20, 2025
2023లో ఎంతమంది పుట్టారంటే?

దేశవ్యాప్తంగా 2023 JAN 1 నుంచి DEC 31 వరకు జిల్లాల వారీగా నమోదైన జనన, మరణాలపై సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(CRS) నివేదికను కేంద్ర హోంశాఖ రిలీజ్ చేసింది. APలో 7,62,093 జననాలు, 4,42,218 మరణాలు, TGలో 6,52,688 జననాలు, 2,40,058 మరణాలు నమోదయ్యాయి. జననాల్లో APలో కర్నూలు, కడప, అనంతపురం, TGలో HYD, NZB, కామారెడ్డి తొలి 3 స్థానాల్లో నిలిచాయి. 2 రాష్ట్రాల్లో ఏ జిల్లాలోనూ లక్షకుపైగా జననాలు నమోదు కాలేదు.
News October 20, 2025
జనగామ: మద్యం టెండర్ల దాఖలకు గడువు పొడిగింపు

మద్యం టెండర్ల దాఖలుకు గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు జనగామ జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి అనిత తెలిపారు. జిల్లాలోని 50 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానించగా ఇప్పటి వరకు 1,600 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. గడువు పొడిగించడంతో మరికొన్ని దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నాయన్నారు.
News October 20, 2025
మంచిర్యాల: పండగపూట భార్యను చంపిన భర్త

పండుగ పూట మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే బ్రిడ్జి వద్ద గృహిణి హత్యకు గురైంది. ఆమె భర్త కుమార్ గొంతు నులిమి చంపి బ్రిడ్జిపై నుంచి పడేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.