News April 26, 2024
జనగామ: బాలికపై అత్యాచారం
రఘునాథపల్లి మండలంలోని ఓ కామాంధుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. SI డి.నరేశ్ ప్రకారం.. 9వ తరగతి చదువుతున్న బాలిక(14)ను అదే గ్రామానికి చెందిన రమేశ్(30) మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక ఎవరికీ చెప్పుకోలేక ఇంట్లో ముభావంగా ఉంటోంది. గమనించిన తల్లి మందలించడంతో విషయం చెప్పింది. దీంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 2, 2024
పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిపాలన విభాగం భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, డీసీపీలు, ఏసీపీలు సీఐలతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ మార్గంలోనే నేటి యువత ప్రయాణించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
News October 2, 2024
WGL: రేపటి నుంచి ఉచిత చేప పిల్లల పంపిణి
రేపటి నుంచి ఉచిత చెప పిల్లల పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మత్సశాఖ సంచాలకులు అల ప్రియాంక తెలిపారు. తొలి విడతగా తొమ్మిది జిల్లాలు హనుమకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాలలో చేపపిల్లల పంపిణీని ప్రారంభిస్తారు. రెండో విడతలో మిగిలిన జిల్లాల్లో ఈనెల ఏడో తేదీ నుంచి పంపిణీ ప్రారంభమవుతుందని ప్రియాంక తెలిపారు.
News October 2, 2024
వరంగల్: మరికాసేపట్లో DSC సర్టిఫికెట్ వెరిఫికేషన్
వరంగల్ జిల్లాలో DSCలో SGT అభ్యర్థులు 1 :3నిష్పత్తిలో 435 మంది, SGT ఉర్దూలో 25 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్కు అర్హత సాధించారని డీఈఓ జ్ఞానేశ్వర్ తెలిపారు. బుధవారం ఉ.10 గంటల నుంచి సా. 5 గంటల వరకు GTలో 270 మంది, SGT ఉర్దూలో 25 మంది అభ్యర్థులు వెరిఫికేషన్కు రావాలన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో, రెండు సెట్లు గెజిటెడ్ తప్పనిసరన్నారు. వివరాలకు www.deowarangal.net సంప్రదించాలన్నారు.