News February 4, 2025

జనగామ: బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 100 రోజుల ఉచిత శిక్షణ

image

ఆర్.ఆర్.బి, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 100 రోజుల ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్.ఎంపీవీ ప్రసాద్ మంగళవారం తెలిపారు. అర్హులైన విద్యార్థులు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈనెల 9తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రూ.2 లక్షల లోపు ఆదాయం ఉండాలన్నారు.

Similar News

News February 5, 2025

NZB: ముగ్గురికి జైలు శిక్ష

image

నిజామాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వరకు హోటల్స్, స్నూకర్ నడిపిన ముగ్గురు వ్యక్తులకు ఒకరోజు జైలు శిక్ష విధిస్తూ జడ్జీ మంగళవారం తీర్పునిచ్చినట్లు SHO రఘుపతి తెలిపారు. ఈ మేరకు సవేరా హోటల్ యజమాని షేక్ అబ్బు, మిలన్ హోటల్ యజమాని సమీర్‌, బోధన్ బస్టాండ్ వద్ద స్నూకర్ షాపు నడుపుతున్న మమ్మద్ షాకీర్ హుస్సేన్‌కు శిక్ష విధించినట్లు వెల్లడించారు.

News February 5, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 5, 2025

భారత్‌తో వివాదం.. మాల్దీవుల టూరిజానికి భారీ దెబ్బ

image

INDతో దౌత్యపరమైన వివాదానికి దిగిన మాల్దీవులకు పర్యాటక రంగంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశానికి 2023లో 2.09 లక్షలుగా ఉన్న ఇండియా టూరిస్టుల సంఖ్య 2024లో 1.30 లక్షలకు పడిపోయింది. మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల్లో IND గతంలో టాప్‌లో ఉండగా ఇప్పుడు ఆరో స్థానానికి చేరింది. దీంతో ఈ ఏడాది ఇండియా నుంచి 3 లక్షల మంది టూరిస్టులను రప్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేయనున్నట్లు మాల్దీవుల అధికారులు తెలిపారు.

error: Content is protected !!