News October 20, 2025

జనగామ: బోర్డుకే పరిమితమైన గిరిజన కార్యాలయం

image

జనగామ జిల్లాలోని గిరిజనుల గోడు పట్టించుకునే వారు కరవయ్యారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లాలో 60 వేల మంది గిరిజనులు ఉన్నారు. కానీ వారి ఇబ్బందులను ఆలకించే అధికారి మాత్రం స్థానికంగా ఉండరు. జనగామ కలెక్టరేట్‌లో గిరిజన శాఖకు గదిని కేటాయించినప్పటికీ సంబంధిత శాఖకు ఏ ఒక్క అధికారి ఉండకపోవడంతో గిరిజన సమస్యలు చెప్పుకునేందుకు హన్మకొండలోని గిరిజన కార్యాలయానికి వెళ్లాల్సి వస్తుంది.

Similar News

News October 20, 2025

2023లో ఎంతమంది పుట్టారంటే?

image

దేశవ్యాప్తంగా 2023 JAN 1 నుంచి DEC 31 వరకు జిల్లాల వారీగా నమోదైన జనన, మరణాలపై సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(CRS) నివేదికను కేంద్ర హోంశాఖ రిలీజ్ చేసింది. APలో 7,62,093 జననాలు, 4,42,218 మరణాలు, TGలో 6,52,688 జననాలు, 2,40,058 మరణాలు నమోదయ్యాయి. జననాల్లో APలో కర్నూలు, కడప, అనంతపురం, TGలో HYD, NZB, కామారెడ్డి తొలి 3 స్థానాల్లో నిలిచాయి. 2 రాష్ట్రాల్లో ఏ జిల్లాలోనూ లక్షకుపైగా జననాలు నమోదు కాలేదు.

News October 20, 2025

జనగామ: మద్యం టెండర్ల దాఖలకు గడువు పొడిగింపు

image

మద్యం టెండర్ల దాఖలుకు గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు జనగామ జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి అనిత తెలిపారు. జిల్లాలోని 50 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానించగా ఇప్పటి వరకు 1,600 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. గడువు పొడిగించడంతో మరికొన్ని దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నాయన్నారు.

News October 20, 2025

మంచిర్యాల: పండగపూట భార్యను చంపిన భర్త

image

పండుగ పూట మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే బ్రిడ్జి వద్ద గృహిణి హత్యకు గురైంది. ఆమె భర్త కుమార్ గొంతు నులిమి చంపి బ్రిడ్జిపై నుంచి పడేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.