News February 12, 2025
జనగామ: మున్సిపాలిటీ వార్డు అధికారులతో కలెక్టర్ సమీక్షా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739288912482_52152631-normal-WIFI.webp)
జనగామ మున్సిపాలిటీ వార్డు అధికారులతో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని టాక్సీ వసూళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, పారిశుద్ధ్యం, ప్లాంటేషన్ తదితర విషయాలపై చర్చించారు. ఎల్ఆర్ఎస్, బిల్డింగ్ పర్మిషన్లపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటి పరిధిలో రోజువారీ పర్యవేక్షణ ఉండాలని సూచించారు.
Similar News
News February 12, 2025
సిద్దిపేట: పాఠశాలలో అకస్మాత్తుగా ఉపాధ్యాయుడి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739325220375_1243-normal-WIFI.webp)
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అకస్మాత్తుగా ఉపాధ్యాయుడు మృతి చెందాడు. వివరాలు.. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రానికి చెందిన గడ్డం నవీన్ గౌడ్ (30) మంగళవారం మధ్యాహ్నం పాఠశాలలో అకస్మాత్తుగా మృతి చెందాడని తోటి ఉపాధ్యాయులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు అబ్బాయి (1) పాపా (2నెలలు) ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 12, 2025
అనంతపురంలో భర్త హత్య.. భార్య మరో ఇద్దరి అరెస్ట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739325804979_727-normal-WIFI.webp)
కాశీ అనే వ్యక్తి హత్య కేసులో అతని భార్యతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు అనంతపురం రూరల్ పోలీసులు తెలిపారు. కేసు వివరాలను మంగళవారం వెల్లడించారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఈ నెల 2న అనంతపురం రూరల్ పరిధిలో కాశీని ఇద్దరితో కలిసి భార్యే హత్య చేసినట్టు వెల్లడైందన్నారు. నిందితులను ఆర్డీటీ స్టేడియం వద్ద అనంతపురం రూరల్ పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ శేఖర్ తెలిపారు.
News February 12, 2025
శంషాబాద్ విమానాశ్రయానికి 6 పుష్పక్ బస్సులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739319504390_51765059-normal-WIFI.webp)
శంషాబాద్ విమానాశ్రయానికి మరిన్ని పుష్పక్ సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఈడీ రాజశేఖర్ తెలిపారు. సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12:55 గం.కు మొదటి బస్సు, రాత్రి 11:55 గంటలకు ఆఖరి బస్సు ఉంటుందన్నారు. నేటి నుంచి విమానాశ్రయం మీదుగా 6 సర్వీసులు రాకపోకలు సాగిస్తాయన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12:50 గంటలకు మొదటి బస్సు, రాత్రి 11:50 గంటలకు చివరి బస్సు ఉంటుందన్నారు.