News April 21, 2025
జనగామ: ‘మూడు దశాబ్దాల జ్ఞాపకాలు’

జనగామ జిల్లా మండల కేంద్రమైన పాలకుర్తి ఉన్నత పాఠశాలలో 1990-91 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు 35 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆనందోత్సవాలతో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు 8 మంది అకాల మృతి చెందగా వారి ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు అప్పటి గురువులను సన్మానించారు.
Similar News
News April 21, 2025
BSWD: జేఈఈ మెయిన్స్లో మెరిసిన అభినయ్

బాన్సువాడ సంగమేశ్వర కాలనీకి చెందిన సకినాల అభినయ్ ఇటీవల ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో సత్తా చాటాడు. ఆల్ ఇండియాలో 2425వ ర్యాంకు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ఆదివారం ఉపాధ్యాయులు, కాలనీవాసులు,తోటి విద్యార్థులు అభినయ్కు అభినందనలు తెలిపారు.
News April 21, 2025
కృష్ణా: బాబోయ్ అడ్మిషన్లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్

కృష్ణా జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్లో అయితే టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తెస్తేనే జీతాలు ఇస్తామంటూ హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు.
News April 21, 2025
NTR: బాబోయ్ అడ్మిషన్లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్

ఎన్టీఆర్ జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్లో అయితే టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తెస్తేనే జీతాలు ఇస్తామంటూ హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు.