News April 7, 2025
జనగామ: మూడెకరాల్లో పంట సాగు.. ఎకరానికే రైతు రైతుబంధు?

మూడెకరాల్లో పంట సాగు చేసినప్పటికీ తమకు రైతు రైతుబంధు అందలేదంటూ రైతులు గ్రామపంచాయతీ ముందు నిరసన చేపట్టిన ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలోని ఇప్పగూడం గ్రామంలో చోటు చేసుకుంది. 3 ఎకరాల్లో పంట సాగు చేస్తే ఎకరానికే రైతుబంధు అందిందని, ఏఈవోలు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టలేదని రైతులు ఆరోపించారు. గ్రామంలో 72 మందికి రావాల్సి ఉందని, ఇప్పటికైనా రైతుబంధు అందించి రైతులను ఆదుకోవాలని వారు కోరారు.
Similar News
News April 9, 2025
పార్వతీపురం జిల్లా వాసులకు గ్యాస్ భారం

పార్వతీపురం జిల్లాలో గ్యాస్ ధరల పెంపు సామాన్యుడి తలపై గుది బండలా మారింది. గృహ అవసరాలకు వాడే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రూ. 50 పెరగడంతో.. రూ. 860కి చేరింది. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. ముందుగా వినియోదారుని సొమ్ముతో సిలిండర్ బుక్ చేసకుంటున్నారు. పలు కారణాలతో ఆ నగదు వినియోగదారుని ఖాతాకు జమ కావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ కామెంట్.
News April 9, 2025
వేములవాడ: క్రికెట్ బాల్ తగిలి బాలుడి మృతి

క్రికెట్ బాల్ తగిలి బాలుడు మృతి చెందిన ఘటన ఓ కుటుంబంలో విషాదం నింపింది. వేములవాడలోని కోరుట్ల బస్స్టాప్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, మానస దంపతుల కుమారుడు అశ్విత్ రెడ్డి(11) ఈ నెల 3న ఇంటి పక్కన పిల్లలతో కలిసి క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలో బాల్ అతడి తలకు తాకడంతో గాయమైంది. చికిత్స కోసం అతడిని కరీంనగర్ అక్కడి నుంచి హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
News April 9, 2025
కొత్తగూడెం: చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో హత్య

చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో వ్యక్తిని హత్య చేసిన ఘటన కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో చోటుచేసుకుంది. సీఐ అశోక్ వివరాలిలా.. మండలంలోని జెడ్ వీరభద్రపురానికి చెందిన కొమరం రాముడు గతనెల11న అదృశ్యంకాగా, మృతదేహం మంగళవారం ఆ గ్రామ చెరువులో లభ్యమైంది. చేతబడి వల్లే తమ కుటుంబ సభ్యులు చనిపోయారని మృతుడి బంధువులు వెంకటేశ్వరావు, పద్దం బాలరాజు రాముడిపై పగ పెంచుకొని హత్య చేసి, చెరువులో పడేశారని సీఐ చెప్పారు.