News October 22, 2025
జనగామ: విద్యాశాఖ నిబంధనలు బేఖాతరు

విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా బోధకుల్లో మార్పు రావడం లేదు. గతంలో పాఠశాలల్లో బోధకులు సెల్ ఫోన్ వినియోగించరాదని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. తరగతి గదుల్లోనే గంటల తరబడి సెల్ ఫోన్లలో తమ వ్యాపార ముచ్చట్లు చెప్పుకుంటూ విద్యకు శఠగోపం పెడుతున్నారు. జనగామ జిల్లాలోని పలు పాఠశాలల్లో ఈ తంతు జరుగుతోంది.
Similar News
News October 22, 2025
ఏయూ: ఈనెల 29న న్యాయవిద్య కోర్సుల్లో ప్రవేశాల కౌన్సిలింగ్

ఏయూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాలలో పిజి-ఎల్ఎల్ఎం కోర్సుల్లో సెల్ఫ్ సపోర్ట్ విధానంలో ప్రవేశాలకు ఈనెల 29న కౌన్సిలింగ్ జరగనుంది. 5ఏళ్ల ఎల్.ఎల్.బి, మూడేళ్ల ఎల్.ఎల్.బి, రెండేళ్ల పిజి-ఎల్ఎల్ఎం కోర్సుల్లో సెల్ఫ్ సపోర్ట్ విధానంలో ప్రవేశాలకు కల్పిస్తున్నట్లు సంచాలకులు ఆచార్య డి.ఏ నాయుడు తెలిపారు. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి పెదవాల్తేరులోని ప్రవేశాల సంచాలకుల కార్యాలయంలో కౌన్సిలింగ్ జరగనుందన్నారు.
News October 22, 2025
GNT: మంచు మొదలైంది బాసు.. జాగ్రత్తగా నడుపు.!

కార్తీక మాసం ప్రారంభం కావడంతో ఉదయం చలితోపాటు మంచు మొదలైంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా రోడ్ల పక్కన ఎక్కువ శాతం వ్యవసాయ భూములు ఉండటంతో, ప్రయాణం చేసే వారికి జాగ్రత్త అవసరం. మంచు పెరగడంతో దారులు కనబడటం కష్టతరం కావచ్చు. వాహనదారులు వేగం తగ్గించి, ఫాగ్ లైట్లు ఉపయోగిస్తూ, రోడ్ల పరిస్థితిని గమనిస్తూ ప్రయాణించాలి. జాగ్రత్త మీ వేగం మీ కుటుంబానికే కాదు.. మరో కుటుంబానికి కూడా దుఃఖాన్ని మిగులుస్తుంది.
News October 22, 2025
2,570 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

RRB 2,570 ఇంజినీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా, బీటెక్ అర్హతగల అభ్యర్థులు ఈనెల 31 నుంచి నవంబర్ 30వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 33ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. రాత పరీక్ష(CBT-1, CBT-2), సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.rrbapply.gov.in