News October 26, 2025
జనగామ: విధుల్లో చేరిన డీఐఈఓ జితేందర్ రెడ్డి

తన వ్యక్తిగత పనుల నిమిత్తం వారం రోజుల పాటు సెలవుపై వెళ్లిన జనగామ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కె.జితేందర్ రెడ్డి విధుల్లో చేరారు. ఆయన సెలవుల్లో ఉన్నప్పుడు ఇన్ఛార్జి డీఐఈవోగా ఎస్.శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. జిల్లాలోనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జరిగిన సిలబస్ పై ఆరా తీస్తున్నారు. త్వరగా పూర్తి చేసి రివిజన్ చేయాలని ఆదేశించారు.
Similar News
News October 26, 2025
ఏలూరు: రెండు రోజులు విద్యా సంస్థలకు సెలవులు

‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో ఏలూరు జిల్లాలో అక్టోబర్ 27, 28వ తేదీల్లో పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించారు. తుఫాన్ కారణంగా తీవ్ర గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ వెట్రి సెల్వి ఆదివారం తెలిపారు. ప్రైవేట్ యాజమాన్యాలు అదనపు తరగతులు లేదా స్టడీ క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
News October 26, 2025
HYD: NIMSకి పెరుగుతున్న రోగుల తాకిడి

పంజాగుట్ట NIMS హాస్పటల్లో ఉదయం సమయాల్లో రోగుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రత్యేకంగా మెడికల్ కౌంటర్, ల్యాబ్, ఫార్మసీ వద్ద వైద్య సేవలకు వస్తున్న రోగులు ఎక్కువగా ఉండటంతో కాస్త ఇబ్బందులు తప్పటం లేదు. అధికారులు అవసరమైతే అదనపు సిబ్బంది, కౌంటర్లు ఏర్పాటు చేసి, వేగవంతమైన సేవలు అందించడం ద్వారా రోగుల భద్రత, సౌకర్యాన్ని పరిరక్షించాలని కోరుతున్నారు.
News October 26, 2025
కరీంనగర్: రేపటి ప్రజావాణి రద్దు.. ఎందుకంటే..?

కరీంనగర్ కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి నిర్వహించే ఆడిటోరియంలో మద్యం దుకాణాల టెండర్కు సంబంధించిన లాటరీ కార్యక్రమం ఏర్పాటు చేసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ అంతరాయాన్ని గమనించి సహకరించాలని ఆమె కోరారు.


