News November 17, 2025
జనగామ: విషాదం.. యువకుడి ఆత్మహత్య

గడ్డిమందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పల్లె సంజయ్(19) ఆదివారం గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో వరంగల్ MGM ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ప్రేమ విఫలమే సూసైడ్కు కారణమని స్థానికులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 17, 2025
ఆటోడ్రైవర్ల సమస్యలపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు: KTR

TG: ఆటోడ్రైవర్ల సమస్యల పరిష్కారం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఫైరయ్యారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రెన్యూవల్ చేయకపోవడంతో బీమా సౌకర్యం కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని 5 వేల మంది ఆటోడ్రైవర్లకు ప్రమాద బీమా తానే కడతానని పేర్కొన్నారు.
News November 17, 2025
ఆటోడ్రైవర్ల సమస్యలపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు: KTR

TG: ఆటోడ్రైవర్ల సమస్యల పరిష్కారం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఫైరయ్యారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రెన్యూవల్ చేయకపోవడంతో బీమా సౌకర్యం కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని 5 వేల మంది ఆటోడ్రైవర్లకు ప్రమాద బీమా తానే కడతానని పేర్కొన్నారు.
News November 17, 2025
హనుమకొండలో వ్యభిచార ముఠా ARREST

వరంగల్ టాస్క్ఫోర్స్ అధికారులకు అందిన సమాచారంతో ఈరోజు హనుమకొండలోని గోపాల్పూర్లో ఓ ఇంటిపై దాడి చేసి వ్యభిచార నిర్వాహకురాలితోపాటు ముగ్గురు యువకులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ.4,270 నగదు,7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను కేయూసీ PSకు తరలించామని చెప్పారు. దాడిలో టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, ఇన్స్పెక్టర్ బాబులాల్, హెడ్ కానిస్టేబుల్ స్వర్ణలతారెడ్డి ఉన్నారు.


