News April 11, 2025
జనగామ: వ్యక్తి బతికుండగానే చనిపోయాడని సృష్టించి భూమి పట్టా

వ్యక్తి బతికుండగానే చనిపోయాడని కాగితాలు సృష్టించి అక్రమంగా ఓ వ్యక్తికి చెందిన భూమిని పట్టా చేసుకున్న ఘటన జనగామ మండలం అడవి కేశవపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. సీపీఎం గ్రామ కార్యదర్శి ప్రభాకర్ ప్రకారం.. గ్రామానికి చెందిన సోమయ్య అనే వ్యక్తికి చెందిన 4.25 గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన ఎల్లమ్మ అక్రమంగా పట్టా చేయించుకుంది. న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మార్వోకు గురువారం వినతిపత్రం అందజేశారు.
Similar News
News January 7, 2026
పొలవరానికి సీఎం రాక.. షడ్యూల్ ఇదే!

ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 10.20 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి, 11 గంటలకు ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2.45 గంటల వరకు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. డయాఫ్రం వాల్ నిర్మాణం, ఇతర కీలక పనుల పురోగతిపై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం 2.55 గంటలకు తిరిగి అమరావతికి పయనమవుతారు.
News January 7, 2026
LIC జీవన్ ఉత్సవ్.. బెనిఫిట్స్ ఇవే

LIC కొత్తగా జీవన్ ఉత్సవ్ పాలసీని ఆవిష్కరించింది. ఇందులో జీవితాంతం ఆదాయం, బీమా రక్షణ లభిస్తుందని తెలిపింది. JAN 12 నుంచి స్కీమ్ అందుబాటులో ఉంటుంది. నెల వయసు పిల్లల నుంచి 65ఏళ్ల వరకు ఈ పాలసీకి అర్హులు. కనీస బీమా మొత్తం ₹5L. గరిష్ఠ పరిమితి లేదు. ప్రతి ₹వెయ్యికి ఏటా₹40 చొప్పున జమ అవుతుంది. 7-17ఏళ్ల తర్వాత ప్రైమరీ బీమా మొత్తంలో 10% ఆదాయం లభిస్తుంది. దీన్ని LIC వద్దే ఉంచితే 5.5% చక్రవడ్డీ చెల్లిస్తుంది.
News January 7, 2026
నిర్మల్: యాక్సిడెంట్.. యువకుడి మృతి

అంత్యక్రియలకు వచ్చి వెళ్తుండగా యువకుడు మృతి చెందిన ఘటన దిలావర్పూర్ మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. నర్సపూర్(జి)కి చెందిన నితిన్(21) HYDలో ఉద్యోగం చేస్తున్నాడు. స్వగ్రామంలో బంధువు చనిపోవడంతో అంత్యక్రియలకు వచ్చాడు. తిరిగి వెళ్లేందుకు బైక్పై నిర్మల్ బయలుదేరాడు. రహదారిపై అటవీ జంతువు అడ్డురావడంతో తప్పించబోయి కిందపడ్డాడు. నిఖిల్కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.


