News February 3, 2025

జనగామ:  5న కిసాన్ మేళా వ్యవసాయ ప్రదర్శన

image

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 5న రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వన్ భాషా షేక్ తెలియజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కిసాన్ మేళాలో రైతులకు సంబంధించిన వ్యవసాయ పనిముట్లు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, నూతన వ్యవసాయ పరిజ్ఞానాన్ని ప్రదర్శన రూపంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News December 29, 2025

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి పదోన్నతి

image

తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్‌కు సెలక్షన్ గ్రేడ్ ఐపీఎస్‌గా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.
2013 బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో పల్నాడు జిల్లా ఎస్పీగా, తిరుమల తిరుపతి దేవస్థానంలో చీఫ్ విజిలెన్స్ & సెక్యూరిటీ విభాగ అధికారిగా పనిచేశారు. అనంతరం తూ. గో జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు పదోన్నతి రావడంతో ఏఎస్పీలు, డీఎస్పీలు, సిఐలు, ఇతర సిబ్బంది అభినందించారు.

News December 29, 2025

4G బుల్లెట్ సూపర్ నేపియర్ గడ్డి పెంపకం

image

చాలా మంది రైతులు సూపర్ నేపియర్ పశుగ్రాసాన్ని జీవాలకు ఇస్తున్నారు. ఇప్పుడు దీన్ని మించి అధిక ప్రొటీన్ శాతం కలిగి, పశువుల్లో పాల దిగుబడిని మరింత పెంచే ‘4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసం’ అందుబాటులోకి వచ్చింది. నేపియర్‌తో పోలిస్తే చాలా మృదువుగా, 10-13 అడుగుల ఎత్తు పెరిగి, ఎకరాకు 200 టన్నుల దిగుబడినిస్తుంది. దీన్ని అన్ని రకాల నేలల్లో కొద్ది నీటి వసతితో పెంచవచ్చు. ఏడాదికి 6-7 సార్లు కోతకు వస్తుంది.

News December 29, 2025

WGL: ఆస్తుల వివరాలు వెల్లడించాల్సిందే!

image

ఉమ్మడి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సుమారు 30 మంది IAS, IPS, IFS అధికారులకు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 2024 ఏడాదికి సంబంధించిన స్థిరాస్తి వివరాలను (IPR) జనవరి 31లోపు సమర్పించాలని పేర్కొంది. నిర్ణీత 33 రోజుల గడువులోగా వివరాలు ఇవ్వని వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు తమ ఆస్తుల డేటాను గడువులోగా ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.