News March 29, 2025

జనగామ: LRS చెల్లించాల్సింది రూ.లక్షల్లో.. చూపించింది రూ.కోట్లల్లో!

image

25% రాయితీతో LRS దరఖాస్తు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31 వరకు అవకాశం ఇచ్చింది. అయితే గడువు దగ్గర పడుతుండటంతో దరఖాస్తుదారులు LRS చెల్లించడానికి వెబ్ పోర్టల్ ఓపెన్ చేయగా.. రూ.లక్షల్లో కట్టాలన్సిన ఫీజు రూ.కోట్లలో చూపించడంలో ఒక్కసారిగా కంగుతున్నారు. పట్టణానికి చెందిన నరసింహ 132.86 చదరపు గజాలకు LRS ఫీజు చెల్లించేందుకు పోర్టల్ ఓపెన్ చేయగా రూ.1.11,92,567 చూపించడంతో షాక్ అయ్యాడు.

Similar News

News March 31, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

> ప్రతి గిరిజన గ్రామం అభివృద్ధే ధ్యేయం: ఎమ్మెల్యే శిరీషాదేవి
> రాజవొమ్మంగి: ఏజెన్సీలో ఘనంగా రంజాన్ 
> అల్లూరి జిల్లాలో కిక్కిరిసిన బస్సులు
> అల్లూరి జిల్లాలో సోషల్ స్టడీస్ పరీక్షకు 11,700 మంది: డీఈవో
> రంపచోడవరం: భారత ఇంజనీర్స్ సమాఖ్య డైరెక్టర్‌గా వెంకయ్య
> పాడేరు: గూడు కట్టాలంటే..మిల్లర్ లాగాల్సిందే..!
> అనంతగిరి: రోడ్డు వేయాలని దండాలు పెట్టి వేడుకోలు

News March 31, 2025

‘రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంది’

image

రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుందని, అధికారులు అప్రమత్తంగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. సోమవారం ప్రజా భవన్ నుంచి ఆయన చీఫ్ సెక్రటరీ, సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి అధికారులకు సూచనలు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి పాల్గొన్నారు.

News March 31, 2025

‘నోబెల్’కు పాక్ మాజీ PM ఇమ్రాన్ నామినేషన్

image

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోమారు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. పాకిస్థాన్ వరల్డ్ అలయెన్స్(PWA) ఈ నామినేషన్ వేసింది. పాక్‌లో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల రక్షణలో ఆయన ఎనలేని సేవ చేశారంటూ ఈ సందర్భంగా కొనియాడింది. గతంలో భారత పైలట్ అభినందన్‌ను విడుదల చేసినందుకు గాను ఇమ్రాన్ ఖాన్‌ను నోబెల్‌కు నామినేట్ చేస్తూ పాక్ పార్లమెంటు తీర్మానం చేసింది. ప్రస్తుతం ఇమ్రాన్ పాక్ జైల్లో ఉన్నారు.

error: Content is protected !!