News January 12, 2025

జనవరి 26న 4 పథకాలు అమలు: ఖమ్మం కలెక్టర్

image

జనవరి 26వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా వంటి నాలుగు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. శనివారం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. 20 రోజులు ఉపాధి హామీ పని చేసిన భూమిలేని కుటుంబాలకు ఆత్మీయ భరోసా వర్తించనుందన్నారు. గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక, పథకాల పర్యవేక్షణకు అధికారులకు మార్గనిర్దేశం చేశారు.

Similar News

News February 22, 2026

ఖమ్మం: ఈ నెల 24న లబ్ధిదారుల ఎంపిక

image

ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పథకాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపికను ఈ నెల 24న నిర్వహించనున్నట్లు కేఎంసీ డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాసరావు తెలిపారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఉదయం 11గంటలకు డ్రా పద్ధతిలో ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న మైనార్టీ మహిళలు తమ వెంట ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో నిర్ణీత సమయానికి హాజరు కావాలని ఆయన సూచించారు.

News February 21, 2026

ఖమ్మం: రైతులకు ALERT.. 27 వరకు విక్రయాలు

image

ఖమ్మం జిల్లాలో 2025-26 సీజన్‌కు సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) పత్తి కొనుగోలు గడువును ఫిబ్రవరి 27 వరకు పొడిగించినట్లు ఖమ్మం అదనపు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని జిన్నింగ్ మిల్లుల్లో ఈ గడువు వరకు కొనుగోళ్లు జరుగుతాయి. రైతులు తమ పత్తిని ‘కపాస్ కిసాన్’ యాప్‌లో స్లాట్ బుకింగ్ చేసుకుని విక్రయించుకోవాలని అధికారులు సూచించారు.

News February 21, 2026

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంపిక కోసం గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు మార్చి 25లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. స్టేట్/సెంట్రల్ బోర్డు గుర్తింపు, గత ఐదేళ్లలో 7వ, 10వ తరగతుల్లో 90% పైగా ఉత్తీర్ణత, మెరుగైన సదుపాయాలు ఉండాలని స్పష్టం చేశారు. దరఖాస్తులు డిప్యూటీ డైరెక్టర్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.