News February 25, 2025
జనసంద్రంగా శ్రీశైలం

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల క్షేత్రం జనసంద్రంగా మారింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినవారు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. మల్లన్నను దర్శించుకుని సాయంత్రం జరిగే ఉత్సవాలను తిలకించి భక్తులు తరిస్తున్నారు.
Similar News
News February 25, 2025
గద్వాల: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి

ఉమ్మడి MBNR జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. వివరాలిలా.. కొత్తకోటకు చెందిన చరణ్రెడ్డి, అనిల్ HYDకి వెళ్తూ బైక్ అదుపు తప్పి మృతిచెందారు. కొత్తపల్లి మండలం నిడ్జింతతండాలో వాహనం అదుపు తప్పి కిందపడటంతో మద్దూరుకు చెందిన రాములు చనిపోయారు. పెళ్లికి వచ్చిన బంధువులను తీసుకెళ్తుండగా బొలెరో వాహనం వారి బైక్ను ఢీకొనడంతో వడ్డేపల్లి మండల వాసి మురళి స్పాట్లోనే ప్రాణాలు వదిలాడు.
News February 25, 2025
ఏనుగుల దాడి ఘటనపై స్పందించిన పవన్

AP: అన్నమయ్య జిల్లాలో భక్తులపై <<15571904>>ఏనుగుల దాడి ఘటనపై<<>> డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ను అసెంబ్లీ నుంచి హుటాహుటిన వై.కోట వెళ్లాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను పరామర్శించాలని సూచించారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. మరోవైపు ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
News February 25, 2025
మహబూబ్నగర్: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి

ఉమ్మడి MBNR జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. వివరాలిలా.. కొత్తకోటకు చెందిన చరణ్రెడ్డి, అనిల్ HYDకి వెళ్తూ బైక్ అదుపు తప్పి మృతిచెందారు. కొత్తపల్లి మండలం నిడ్జింతతండాలో వాహనం అదుపు తప్పి కిందపడటంతో మద్దూరుకు చెందిన రాములు చనిపోయారు. పెళ్లికి వచ్చిన బంధువులను తీసుకెళ్తుండగా బొలెరో వాహనం వారి బైక్ను ఢీకొనడంతో వడ్డేపల్లి మండల వాసి మురళి స్పాట్లోనే ప్రాణాలు వదిలాడు.