News March 31, 2025

జనసేనపై అంబటి రాంబాబు ట్వీట్

image

జనసేనపై మరోసారి మాజీమంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు తనదైన శైలిలో ట్విటర్‌లో విమర్శలు చేశారు. ‘బాబుకు సుత్తి కొట్టడమే.. సత్తా లేని జనసేన పని.!’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏ పని చేసినా, దానిని గుడ్డిగా సమర్థించడమే పవన్ కళ్యాణ్‌కు పనిగా మారిందని కొంతమంది కామెంట్లు చేయగా, అంబటి రాంబాబును విమర్శిస్తూ మరి కొంతమంది ఆ ట్వీట్ కింద కామెంట్లు చేస్తున్నారు. 

Similar News

News April 2, 2025

GNT: కారు ప్రమాద ఘటనపై పెమ్మసాని స్పందన

image

తెనాలికి చెందిన గిడుగు రవీంద్ర మోహన్ బాబు కుటుంబానికి జరిగిన కారు ప్రమాద ఘటనపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. మృతుల బంధువులను, ఆసుపత్రి వర్గాలను డిల్లీ నుంచి ఫోన్ ద్వారా సంప్రదించారు. గుండె నిబ్బరం చేసుకుని సందీప్ దంపతులకు అందంగా అండగా నిలవాలని సూచించారు. ప్రభుత్వం తరఫున సాయం అందేలా చూసే ప్రయత్నం చేస్తానని, ఈ సందర్భంగా సందీప్ బంధువులకు పెమ్మసాని వివరించారు.

News April 1, 2025

GNT: హైకోర్టుకు మాజీమంత్రి విడదల రజిని

image

ఏసీబీ కేసులో ఏపీ హైకోర్టును మంగళవారం మాజీ మంత్రి విడదల రజిని ఆశ్రయించారు. ఏసీబీ కేసు నుంచి ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో రజిని మరిది గోపి, పీఏ రామకృష్ణ పిటిషన్లు దాఖలు చేశారు. వివరాలు సమర్పించాలని హైకోర్టు ఏసీబీకి ఆదేశించింది. తదుపరి విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

News April 1, 2025

పాఠశాలలు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: DEO

image

ఒంటిపూట బడులకు భిన్నంగా తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి C.V రేణుక ఒక ప్రకటనలో హెచ్చరించారు. మార్చి 15 నుండి ప్రభుత్వం ఒంటిపూట బడులు ప్రకటించినా కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలు వాటిని పాటించడం లేదని డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 7.45 నుండి మధ్యాహ్నం 12.30 ని.ల వరకు మాత్రమే పాఠశాలలు నిర్వహించాలని స్పష్టం చేశారు.

error: Content is protected !!