News September 14, 2025
జన్నారం: భూమి కోసమే ఉద్యమం!

లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని జన్నారం, దండేపల్లి మండలాల్లో పోడు భూముల సమస్య జటిలమవుతోంది. జన్నారం మండలం పాలగోరిలో తమ పూర్వీకుల భూములను అప్పగించాలని ఆదివాసులు ఆందోళన చేపట్టారు. అదే సమయంలో దండేపల్లి మండలం లింగాపూర్, దమ్మన్నపేటలో కూడా ఆదివాసులు అటవీ భూములు ఇవ్వాలని పోరు సాగిస్తున్నారు. అటవీ సిబ్బందికి, ఆదివాసులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో రెండు మండలాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Similar News
News September 14, 2025
కలెక్షన్లలో దుమ్మురేపుతోన్న ‘మిరాయ్’

తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఫాంటసీ మూవీ ‘మిరాయ్’ కలెక్షన్లలో దుమ్మురేపుతోంది. ఈ చిత్రం రెండు రోజులకు వరల్డ్ వైడ్గా ₹55.60 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. పాజిటివ్ టాక్ రావడం, వీకెండ్ కూడా కావడంతో వసూళ్లు ఇంకా పెరుగుతాయని వారు భావిస్తున్నారు. మంచు మనోజ్ కీలక పాత్రలో, రితికా నాయక్ హీరోయిన్గా నటించారు.
News September 14, 2025
సెప్టెంబర్ 17 నుంచి స్వస్త్ నారీ-సశక్త్ పరివార్: కలెక్టర్

జనగామ జిల్లాలో స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమమని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, పిల్లల ఆరోగ్య సాధికారత కోసం శిబిరాలు ఏర్పాటు చేసి స్క్రీనింగ్ చేయనున్నట్లు వివరించారు. ANC తనిఖీలు చేపట్టి రోగనిరోధక శక్తిపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1న మెగా రక్తదానం కూడా జరుగుతుందన్నారు.
News September 14, 2025
ASIA CUP: ట్రెండింగ్లో Boycott INDvPAK

ఆసియాకప్లో భాగంగా మరికొన్ని గంటల్లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో SMలో కొందరు ఇండియన్స్ BoycottINDvPAK హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. టెర్రరిస్టులతో క్రికెట్ వద్దు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచును చూడకుండా టీవీలు ఆఫ్ చేసి పహల్గామ్ దాడి బాధితులకు అండగా నిలవాలని కోరుతున్నారు. మరికొందరు క్రికెట్ను ఉగ్రవాదంతో ముడిపెట్టకూడదని అంటున్నారు. దీనిపై మీ కామెంట్?