News February 27, 2025
జన్నారం: 2రోజులపాటు పక్షి మహోత్సవం

కవ్వాల్ అభయారణ్యం, గోదావరి పరివాహక ప్రాంత పక్షి వైవిధ్యంపై ప్రజలలో అవగాహన తీసుకువచ్చేందుకు మార్చి 1, 2 తేదీల్లో పక్షి మహోత్సవాన్ని నిర్వహించనున్నామని ఎఫ్ఆర్ఓ సుష్మా రావ్ తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ అటవీ శాఖ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో మార్చి 1, 2 తేదీల్లో మంచిర్యాల కలెక్టరేట్ వద్ద పక్షి మహోత్సవాన్ని నిర్వహిస్తారన్నారు. ప్రకృతి, పక్షి ప్రేమికులు, ప్రజలు పాల్గొనవచ్చన్నారు.
Similar News
News November 6, 2025
అమరరాజా ఫ్యాక్టరీలో భారీ చోరీ..

యాదవరి మండలంలోని అమరరాజా బ్యాటరీ ఫ్యాక్టరీలో భారీ చోరీని పోలీసులు ఛేదించారు. రూ.2.73 కోట్ల విలువైన లెడ్ బుష్ మాయంపై కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా ఏడుగురిని అరెస్టు చేసి దీనికి సంబంధించి రూ. 82 లక్షల విలువ చేసే మెటీరియల్, రూ. 68 లక్షల నగదు, రూ.1.18 కోట్ల విలువచేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సంస్థ ఉద్యోగుల సహకారంతో చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు.
News November 6, 2025
అసీమ్ మునీర్ నా భార్యను హింసిస్తున్నాడు: ఇమ్రాన్ ఖాన్

ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ పాక్ చరిత్రలోనే పెద్ద నియంత అని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ‘అతని మానసిక స్థితి సరిగ్గా ఉండదు. అధికారం కోసం అతను దేనికైనా తెగిస్తాడు. నా భార్య బుష్రా బీబీని ఒంటరిగా ఉంచి మానసికంగా హింసిస్తున్నాడు. బానిసత్వం కంటే మేము చావునే కోరుకుంటాం. ఎప్పటికీ అతని ముందు తలవంచం. మమ్మల్ని మేము సరెండర్ చేయం’ అని తెలిపారు. కాగా 2023 AUG నుంచి ఇమ్రాన్ జైలులోనే ఉన్నారు.
News November 6, 2025
కృష్ణా: హవే విస్తరణపై ఎమ్మెల్యేల ముఖ్య సూచనలివే.!

VJA-MTM జాతీయ రహదారి నం.65 రహదారి విస్తరణపై బుధవారం విజయవాడలో అధికారులు, ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడె ప్రసాద్, వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. NH-65 రహదారిని NH-16తో మూడు ప్రాంతాలలో అనుసంధానం చేయాలని ఎమ్మెల్యేలు అధికారులను కోరారు. రహదారి సమీప గ్రామాల్లో అండర్ పాస్ల నిర్మాణం, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజి వ్యవస్థ అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేలు సూచించారు.


