News February 15, 2026
జన సంద్రంగా మారిన శ్రీశైలం క్షేత్రం

ఇల కైలాసమైన శ్రీశైలం జన సంద్రంగా మారింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి భక్తులు శ్రీశైలానికి పోటెత్తారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి నేరుగా స్వామి అమ్మవార్ల దర్శనార్థమై ఆలయ క్యూలైన్లలో భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. భక్తుల రద్దీ నేపథ్యంలో దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
Similar News
News February 15, 2026
2.50 లక్షల మంది భక్తులు క్షేత్రంలో ఉన్నారు: కలెక్టర్

శ్రీశైల క్షేత్రంలో ఒక్కరోజు నిద్రిస్తే అనేక యుగాల పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసంతో దాదాపు 2.50 లక్షల మంది భక్తులు ప్రస్తుతం క్షేత్రంలో ఉన్నారని కలెక్టర్ రాజకుమారి అన్నారు. ఎస్పీ సునీల్ షోరాణ్, జేసీ కార్తీక్ తో కలిసి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించారు. పాగాలంకరణ కార్యక్రమానికి దాదాపు 7 నుంచి 8 వేల మంది భక్తులను అనుమతించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
News February 15, 2026
టెన్త్ అర్హతతో 22,195 ఉద్యోగాలు

రైల్వేలో 22,195 గ్రూప్-D పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్, ఐటీఐ అర్హత గలవారు మార్చి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18-33 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది. CBT, PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, మహిళలకు రూ.250. వెబ్సైట్: https://www.rrbcdg.gov.in/
News February 15, 2026
BREAKING: భువనగిరిలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

భువనగిరి స్వర్ణగిరి ఆలయం సమీపాన తెలంగాణ గురుకుల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన బాల ఆకాష్ అనే పదో తరగతి విద్యార్థి బావిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


