News February 26, 2025

జపాన్ సకురాకు సంగారెడ్డి ప్రాజెక్టు.. కలెక్టర్ అభినందనలు

image

జపాన్ సుకూరాకు ఎంపికైన ఆందోల్ మండలం కన్‌సాన్‌పల్లి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థి స్రవంతి, గైడ్ ఉపాధ్యాయుడు సిద్ధేశ్వరని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం సన్మానించారు. విద్యార్థిని తయారు చేసిన డిస్క్ లిఫ్టర్ ప్రాజెక్టు గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జపాన్ వెళ్లి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Similar News

News July 6, 2025

తెలుగు పాఠ్యాంశంలో ‘సీతాకోక చిలుక’ గేయం

image

మహారాష్ట్ర ప్రభుత్వ బాలభారతి ఒకటో తరగతి తెలుగు వాచకంలో కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రాసిన “సీతాకోక చిలుక” గేయం పాఠ్యాంశంగా చోటు దక్కించింది. తొట్టంబేడు మండలానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం ఉపాధ్యాయుడు, రచయిత, మిమిక్రీ కళాకారుడు. తన గేయం తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా చేరడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. పలువురు ఆయనను అభినందిస్తున్నారు.

News July 6, 2025

పల్నాడు: చుక్కల భూములపై కలెక్టర్ ఆదేశాలు

image

పల్నాడు జిల్లాలోని చుక్కల భూములపై జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. భూ సమస్యల సమీక్షా సమావేశంలో రెవెన్యూ అధికారులతో ఆయన చర్చించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యను వేగంగా పరిష్కరించాలని సూచించారు. భూమిపై తగిన ఆధారాలు చూపిన రైతుల భూములను 22ఎ జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News July 6, 2025

SRCL: కుమార్తె వైద్యానికి అప్పులు.. తీర్చలేక తండ్రి సూసైడ్!

image

వీర్నపల్లి మండలం వన్‌పల్లికి చెందిన కుమ్మరి పోచయ్య(65) ఆర్థిక ఇబ్బందులతో తెల్లవారుజామున చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. ఆయన కుమార్తె తిరుమల(25) చిన్నతనం నుంచే అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్షల్లో అప్పులు చేశాడు. వాటిని తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురైన అతడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.