News June 21, 2024

జమ్మలమడుగు: వ్యక్తి అనుమానాస్పద మృతి

image

జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని మైలవరం మండలం వద్దిరాల సచివాలయం వద్ద శుక్రవారం వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు తెలుస్తుంది. మృతుడు పెద్దముడియం గ్రామానికి చెందిన దూదేకుల హుస్సేన్ వలిగా గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు గొల్లపల్లె క్రషర్ మిషన్ ఆపరేటర్ గా పని చేసేవాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మద్యం సేవించడం అలవాటు ఉంది. మృతికి గల కారణాలు తెలియాలి.

Similar News

News October 4, 2024

వైఎస్‌ఆర్‌ జిల్లా పేరు మార్చాలన్న మంత్రి.. దీనిపై మీ కామెంట్

image

వైఎస్సార్ జిల్లా పేరును మార్చాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ CM చంద్రబాబుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. YCP ప్రభుత్వం అవగాహనా రాహిత్యంతో వైఎస్‌ఆర్‌ కడప జిల్లాను వైఎస్‌ఆర్‌ జిల్లాగా మార్చిందని మంత్రి పేర్కొన్నారు. కడప జిల్లా చారిత్రక నేపథ్యం, వైఎస్ఆర్ చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చాలని మంత్రి సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై మీ కామెంట్..

News October 4, 2024

కడప: YCPకి మాజీ మంత్రి కుమారుడి రాజీనామా

image

జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మున్సిపల్ ఛైర్మన్ మూలే హర్షవర్ధన్ రెడ్డి శుక్రవారం ఉదయం వైసీపీకి రాజీనామా చేశారు. ఇతను మాజీ హోమ్ మినిస్టర్ మైసూరారెడ్డి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డికి స్వయానా పెదనాన్న కుమారుడు. ఈయన గడిచిన ఎన్నికల్లో కూడా వైసీపీ పక్షాన క్రియాశీలకంగా వ్యవహరించారు. హర్షవర్ధన్ రెడ్డి గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు.

News October 4, 2024

కడప: అధికారుల పేరుతో నగదు వసూలు.. తస్మాత్ జాగ్రత్త

image

కడప జిల్లాలో ఉన్నతాధికారుల పేరుతో సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్లు వసూళ్లకు పాల్పడుతున్నాడని, అలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శివ శంకర్ సూచించారు. ఉన్నతాధికారులు, జిల్లా అధికారుల పేరు, ఫోటో పెట్టి వాట్సాప్ ఖాతాను సైబర్ నేరగాళ్లు సృష్టించి అత్యవసరంగా డబ్బు పంపాలని మెసేజ్‌లు పంపిస్తున్నారన్నారు.
ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు ఎవరూ డబ్బు కానీ పంపాలని ఎప్పుడు అడగరనేది తెలిపారు.