News February 11, 2026
జమ్మికుంట: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి.. కేసు నమోదు

చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ ప్రకారం.. ధర్మారంకు చెందిన మారపల్లి <<19106431>>ఐలయ్య<<>> (59) మంగళవారం రాత్రి బస్టాండ్ వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా JMKT నుంచి వావిలాల వైపు వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయనను చికిత్స నిమిత్తం HNK తరలించగా చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందినట్లు కుమారుడు అజయ్ పిర్యాదు చేసినట్లు తెలిపారు.
Similar News
News February 20, 2026
HYD: మ్యారేజ్ లైఫ్లో పాత పద్దతులకు చెక్

సర్దుకుపోవడం అంటే ఆత్మగౌరవాన్ని కోల్పోవడమే కాదని యువత వివాహ వ్యవస్థలో పాత ధోరణులను పక్కన పెడుతున్నారు. పెళ్లి సామాజిక బాధ్యతే కాదని, ఇద్దరు వ్యక్తుల మధ్య సమానత్వం, గౌరవ బంధమని నమ్ముతున్నారు. నచ్చిన భాగస్వామిని ఎంచుకునే, జీవించే హక్కు ఉందని రాజ్యాంగం చెబుతోంది. బలవంతపు సర్దుబాట్లు ఒత్తిడికి దారితీస్తున్న తరుణంలో, యువత తమ కెరీర్, ఆన్లైన్ కమ్యూనిటీలతో తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకుంటున్నారు.
News February 20, 2026
అభిషేక్.. దొరికిపోతావ్ జాగ్రత్త: అమీర్

టీ20 ప్రపంచకప్లో అభిషేక్ శర్మ పేలవ ప్రదర్శనపై పాక్ మాజీ బౌలర్ మహమ్మద్ అమీర్ హెచ్చరించారు. అభిషేక్ ప్రతీ బంతిని భారీ షాట్గా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది సరికాదని సూచించారు. అంతర్జాతీయ క్రికెట్లో క్వాలిటీ బౌలర్లు ఉంటారు కాబట్టి వీక్నెస్ పసిగట్టేస్తారని తెలిపారు. పాక్ ఓపెనర్ ఆయుబ్ తొలినాళ్లలో ఇలాగే ఆడి ఇప్పుడు ఆఫ్ సైడ్ ఆడేందుకు తడబడుతున్నాడని.. అభిషేక్ పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు.
News February 20, 2026
మున్సిపల్ ఎన్నికలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి: హరీశ్ రావు

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. క్యాతన్పల్లిలో BRS కు స్పష్టమైన మెజార్టీ ఉన్నా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి అడ్డుకున్నారని ఆరోపించారు. మహిళా కౌన్సిలర్పై దాడులు చేసిన తమ పార్టీ నేతలపైనే కేసులు పెట్టడం విడ్డూరమని ఆక్షేపించారు. క్యాతన్పల్లి ఇన్సిడెంట్ పై గవర్నర్ స్పందించి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


