News February 25, 2026
జమ్మికుంట: రెండు రోజులుగా నిలకడగానే పత్తి ధర

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీలో బుధవారం పత్తి ధరలు నిన్నటి లాగా నిలకడగానే కొనసాగాయి. మార్కెట్కు పత్తి రాక సాధారణంగా ఉన్నప్పటికీ రెండు రోజులుగా ధరల్లో పెద్దగా మార్పు లేకపోవడం గమనార్హం. మొత్తం 24 వాహనాల ద్వారా 205 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ.7,550, కనిష్టంగా 7,000 ధర పలికింది. పత్తిలో తేమ శాతం తక్కువగా ఉండి, నాణ్యత బాగున్న పంటకు గరిష్ట ధర లభిస్తోందని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News February 27, 2026
ఇవాళ పుట్టపర్తి రావొద్దు: కలెక్టర్

జిల్లాలోని దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం పుట్టపర్తి కలెక్టరేట్లో ప్రతీ నెల 4వ శుక్రవారం నిర్వహించే ప్రత్యేక ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం అనివార్య కారణాల వల్ల తాత్కాలికంగా రద్దు చేశామని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఒక ప్రకటన తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే దివ్యాంగులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఫిర్యాదులు సమర్పించడానికి కలెక్టర్ కార్యాలయానికి రావద్దని కోరారు.
News February 27, 2026
బౌలర్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి: సూర్య

బ్యాటర్లు అద్భుతంగా రాణించారని, బౌలింగ్ విభాగంలో ఇంకాస్త ‘క్లినికల్’గా ఉండాల్సిందని జింబాబ్వేపై విజయం తర్వాత టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ అభిప్రాయపడ్డారు. జింబాబ్వే బ్యాటర్ బెన్నెట్ అద్భుతంగా ఆడారని, సండే WI తో మన బౌలర్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. కోల్కతాలో విండీస్తో జరిగే సెమీఫైనల్ బెర్త్ పోరుకు తమ వ్యూహాలను మరింత పకడ్బందీగా సిద్ధం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
News February 27, 2026
ఆంథ్రోపిక్కు పెంటగాన్ అల్టిమేటం!

అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ప్రముఖ AI సంస్థ ‘ఆంథ్రోపిక్’కు డెడ్ లైన్ విధించింది. తమ Claude మోడల్ను మిలిటరీ అవసరాలకు, నిఘా పనులకు వాడుకోవడానికి అనుమతించాలని, లేదంటే ఫిబ్రవరి 27 సాయంత్రం కల్లా ₹1,600 కోట్ల కాంట్రాక్ట్ రద్దు చేస్తామని హెచ్చరించింది. కంపెనీని ‘సప్లై చైన్ రిస్క్’గా ప్రకటించి బ్లాక్ లిస్ట్లో పెడతామని అల్టిమేటం ఇచ్చింది. AIని యుద్ధానికి ఉపయోగించాలని ట్రంప్ సర్కార్ యోచిస్తోంది.


