News September 3, 2025

జమ్మికుంట: రైలు నుండి పడి వ్యక్తి మృతి

image

పెద్దపల్లి(D) పాలకుర్తి మం. కుక్కలగూడూర్ గ్రామానికి చెందిన సంగెం నరేష్‌(33) రైలు నుంచి కిందపడి మృతి చెందాడు. బిజిగిరి షరీఫ్ దర్గా దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో JMKT-బిజిగిరి షరీఫ్ స్టేషన్ల మధ్య ఫ్లైఓవర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతుడి ఫోన్ ఆధారంగా కుటుంబానికి సమాచారం అందించారు. శవాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 3, 2025

పెద్దారెడ్డికి లైన్ క్లియర్.. నేడు తాడిపత్రికి రాక

image

తాడిపత్రి మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలతో రేపు తాడిపత్రిలోకి వస్తున్నారు. పలుమార్లు తాడిపత్రికి రావాలని ప్రయత్నించినప్పటికీ పోలీసులు అడ్డుకోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేతిరెడ్డి తాడిపత్రిలోకి వెళ్ళవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపు తాడిపత్రికి వెళ్తారా లేదా చూడాలి.

News September 3, 2025

పెరిగిన డిస్కౌంట్.. మరింత చౌకగా రష్యన్ ఆయిల్

image

భారత్‌కు క్రూడ్ ఆయిల్ మరింత చౌకగా లభించనుంది. రష్యా డిస్కౌంట్స్ పెంచడమే ఇందుకు కారణం. బ్యారల్ ధరపై 3-4 డాలర్ల మేర ధర తగ్గనుంది. ప్రస్తుతం IND రోజుకు 5.4 మిలియన్ల బ్యారళ్ల ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. అందులో 36% రష్యా నుంచే కొంటోంది. ఓవైపు ట్రంప్ 50% టారిఫ్స్‌తో ఒత్తిడి తెస్తున్నా భారత్‌ వెనక్కి తగ్గకుండా రష్యా, చైనాకు మరింత దగ్గరవుతోంది. తాజాగా చైనాలో జరిగిన SCO సమ్మిట్‌తో అది స్పష్టమైంది.

News September 3, 2025

అంటువ్యాధులు ప్రబలకుండా చూడండి: డీఎంహెచ్ఓ

image

బషీరాబాద్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)ను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డీఎంహెచ్ఓ లలితాదేవి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి, అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాల కారణంగా మలేరియా, డెంగ్యూ వంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున, అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులకు ఆమె సూచించారు.