News April 12, 2025
జమ్మిచేడు జమ్ములమ్మకు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక దర్శనం

జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని జమ్మిచేడులో వెలిసిన జమ్ములమ్మకు శనివారం పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు కృష్ణా నది జలాలతో అమ్మవారి విగ్రహాన్ని అభిషేకించి, అర్చన, ఆకు పూజ, హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జమ్ములమ్మను దర్శించుకునేందుకు ఏపీ, తెలంగాణ నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Similar News
News December 22, 2025
అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: SP

PGRS అర్జీల పరిష్కారానికి అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని SP బిందుమాధవ్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన స్వయంగా 27 మంది ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎస్పీ, ఆయా అర్జీలను సంబంధిత అధికారులకు పంపి, గడువులోగా పరిష్కరించాలని సూచించారు. చట్టపరిధిలో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.
News December 22, 2025
వక్ఫ్ భూముల్లో హద్దుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

జిల్లాలో వక్ఫ్ భూములను పూర్తిస్థాయిలో సర్వే చేసి హద్దులు ఏర్పాటుకు వక్ఫ్ బోర్డు, సర్వే, రెవిన్యూ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లా స్థాయి ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డ్ అధికారులను సమన్వయం చేసుకుంటూ వక్ఫ్ భూములను నిర్దేశిత మార్గదర్శకాలు ప్రకారం సర్వే జరిగేలా చూడాలన్నారు.
News December 22, 2025
కామారెడ్డి కలెక్టరేట్లో బ్రేస్ట్ ఫీడింగ్ క్యాబిన్ ప్రారంభం

జిల్లా మహిళ సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో తల్లులు పిల్లలకు పాలు ఇచ్చేందుకు తయారు చేసిన బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్ను కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇలాంటి క్యాబిన్లను బస్టాప్లలో, రద్దీ ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని సూచించారు.


