News October 6, 2025
జయచంద్ర రెడ్డి చుట్టూ అన్నీ వివాదాలే..?

MLA అభ్యర్థిగా జయచంద్రా రెడ్డి ఎన్నికైన నాటి నుంచి అనేక వివాదాలు చుట్టుముట్టాయి. జయచంద్ర రెడ్డి TDP బీ ఫార్మ్ తీసుకోవడంతో శంకర్ యాదవ్ వర్గీయులు తీవ్ర ఆందోళనలు దిగారు. ఎన్నికల టైంలో పోలింగ్ బూతుల్లో ఏజంట్లను నియమించుకోలేక పోయారని వాదన ఉంది. ముఖ్యంగా పెద్దిరెడ్డి కుటుంబానికి సహకారం అందిస్తున్నట్లు గతంలో తెలుగు తమ్ముళ్లు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Similar News
News October 6, 2025
నకిలీ మద్యం ఎక్కడ విక్రయించారు..

మొలకలచెరువులో నకిలీ మద్యంను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎంత కాలంగా నకిలీ తయారు చేసి ఎక్కడ ఎక్కడ విక్రయించారనేది విచారణ చేస్తున్నారు. నకిలీ మద్యం అమ్మకాలు చేసిన ఓ డైరీ పోలీసులకు లభించిందని ప్రచారం జరుగుతోంది. త్వరలో దీనిపై మారిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు నుంచి సమాచారం.
News October 6, 2025
బంగారుపాళ్యం: ఐచర్ ఢీకొని వృద్ధురాలు మృతి

బెంగళూరు- చెన్నై జాతీయ రహదారి కేజీ సత్రం సమీపంలో ఐచర్ వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. సోమవారం ఉదయం కమ్మరపల్లి గ్రామానికి చెందిన మునస్వామి భార్య రాజమ్మ రోడ్డు దాటుతున్న సమయంలో బెంగళూరు వైపు నుంచి చిత్తూరు వైపు వస్తున్న ఐచర్ వాహనం ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు అంబులెన్స్లో ప్రభుత్వాస్పతికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ఆమె మృతి చెందింది.
News October 6, 2025
చిత్తూరు: 18 మండలాలలో వర్షం

జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 18 మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. శాంతిపురం మండలంలో అత్యధికంగా 86.4 మి.మీ వర్షపాతం నమోదైంది. వి.కోటలో 38, రామకుప్పంలో 24.8, సదుంలో 20.6, రొంపిచెర్లలో 17.8, కుప్పంలో 12, గుడుపల్లెలో 10.4, విజయ పురంలో 10.2, చిత్తూరు అర్బన్లో 4.2, కార్వేటినగరంలో 3.4, పెనుమూరు, పుంగనూరు, నిండ్రలో 3.2, బంగారుపాళ్యంలో 3, నగరిలో 2.2మీ. మీ. వర్షపాతం నమోదయింది.