News October 18, 2025

జయశంకర్ జిల్లాలో 1055 మద్యం టెండర్లకు దాఖలు

image

భూపాలపల్లి జిల్లాలో మద్యం శనివారం సాయంత్రం మద్యం టెండర్లు దాఖలు ముగిశాయి. జయశంకర్, ములుగు జిల్లాలకు 59 షాపులు ఉండగా.. 1055 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తు రూ.3 లక్షల చొప్పున దరఖాస్తు ఫీజులను చెల్లించారు. గతేడాది 59 మద్యం షాపులకు 2161 దరఖాస్తులు వచ్చాయి. గతంతో పోలిస్తే సగం దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇది ఇలా ఉంటే మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు.

Similar News

News October 18, 2025

7 వికెట్లతో సత్తా చాటిన షమీ

image

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయిన టీమ్ ఇండియా స్టార్ పేసర్ షమీ రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నారు. ఉత్తరాఖండ్‌తో జరిగిన తొలి మ్యాచులో 7 వికెట్లు తీసి సత్తా చాటారు. దీంతో బెంగాల్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. షమీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఫిట్‌నెస్ కారణంగా AUSతో సిరీస్‌కు షమీని దూరం పెట్టినట్లు సెలక్టర్లు ప్రకటించడం, ఆ వ్యాఖ్యలపై షమీ ఫైరవడం తెలిసిందే.

News October 18, 2025

విశాఖ-పార్వతీపురం మధ్య స్పెషల్ ట్రైన్

image

దీపావళి రద్దీ దృష్య్టా ఈనెల 27 వరకు విశాఖ-పార్వతీపురం మధ్య మెము స్పెషల్ ట్రైన్ నడవనుంది. విశాఖలో ఉ.10కు బయలుదేరి పార్వతీపురం మ.12.20కు చేరుకుంటుంది. తిరిగి పార్వతీపురంలో మ.12.45కు బయలుదేరి బొబ్బిలి 1.10కు చేరుకుని విశాఖ సా.4గంటలకు వెళ్లనుంది. సింహాచలం, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, కోమటిపల్లి, డొంకినవలస, బొబ్బిలి, సీతానగరంలో ఆగనుంది. > Share it

News October 18, 2025

పిశాచ స్థానం పట్ల నిర్లక్ష్యం వద్దు: వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు

image

పిశాచ స్థానాన్ని నిర్లక్ష్యం చేయకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ విషయం పట్ల అలసత్వం వహిస్తే ఇంట్లో ఉండేవారు ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ‘ఇంటి చుట్టూరా ప్రహరీకి నడుమ ఉండే ఖాళీ స్థలాన్ని పిశాచ స్థానంగా చెబుతారు. ఇది ఉంటేనే గాలి, వెలుతురు ఇంట్లోకి వస్తాయి. ఇవి ఆ గృహంలో నివసించే వారికి ఉత్తేజాన్ని కలిగిస్తాయి’ అని తెలిపారు.<<-se>>#Vasthu<<>>