News November 23, 2025

జర్నలిస్టుల అక్రిడిటేషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

తూర్పుగోదావరి జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల (2026-27) జారీ ప్రక్రియ ప్రారంభమైంది. పాత కార్డుల గడువు ఈ నెల 30తో ముగుస్తుండటంతో నూతన కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. అర్హులైన పాత్రికేయులు సమాచార పౌర సంబంధాల శాఖ నిబంధనల ప్రకారం దరఖాస్తులు సమర్పించాలని, నూతన కార్డులు రెండేళ్ల పాటు అమలులో ఉంటాయని ఆమె వెల్లడించారు.

Similar News

News January 29, 2026

రాష్ట్రంలో తూ.గో జిల్లాకు ద్వితీయ స్థానం

image

RTC నిర్వహించిన లాజిస్టిక్స్ డోర్ డెలివరీల్లో తూ.గో జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానం సాధించింది. అందుకు విశేషంగా కృషి చేసిన జిల్లా ప్రజా రవాణా అధికారి వై.ఎస్.ఎన్ మూర్తిని విజయవాడ కార్యాలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావులు అభినందించారు. ప్రశంసా పత్రం, రివార్డుతో డీపీటీఓ మూర్తిని సత్కరించారు. ఆర్టీసీ అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

News January 29, 2026

తూ.గో: బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి ఎస్సీ కమిషన్ ఛైర్మన్ ఆదేశం

image

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేఎస్ జవహర్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాజమండ్రి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆయన సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో సమస్యలను పరిష్కరించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సూచించారు. అనంతరం బాధితుల నుంచి వినతి పత్రాలను స్వీకరించి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

News January 29, 2026

తూ.గో: బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి ఎస్సీ కమిషన్ ఛైర్మన్ ఆదేశం

image

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేఎస్ జవహర్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాజమండ్రి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆయన సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో సమస్యలను పరిష్కరించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సూచించారు. అనంతరం బాధితుల నుంచి వినతి పత్రాలను స్వీకరించి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.