News March 4, 2025
జర్మనీలో తూ.గో. మంత్రికి ఘన స్వాగతం

జర్మనీ డి బెర్లిన్ ఎక్స్పో సెంటర్ సిటీలో ప్రారంభమయ్యే ఐటీబీ బెర్లిన్-2025 సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్కు జర్మనీలో జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో పర్యటక రంగంలో పెట్టుబడులు కోసం ఈ సదస్సులో చర్చించడం జరుగుతుంది. మంత్రితో పాటు ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి పాల్గొంటారు.
Similar News
News August 16, 2025
రాజమండ్రి: విద్యుత్ శాఖ శకటానికి ప్రథమ స్థానం

రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. మొత్తం 12 శకటాలు పాల్గొన్న ఈ ప్రదర్శనలో, విద్యుత్ సంస్థ శకటం మొదటి స్థానం దక్కించుకుంది. వ్యవసాయం, ఉద్యానవన శాఖల శకటాలు రెండవ స్థానం, సాంఘిక సంక్షేమ శాఖ శకటం మూడవ స్థానం పొందాయి. అలాగే, పశు సంవర్థక శాఖ శకటం నాలుగవ స్థానం, పర్యాటక శాఖ శకటం ఐదవ స్థానం సాధించాయి.
News August 15, 2025
రాజమండ్రి: విద్యుత్ శాఖ శకటానికే ప్రథమ స్థానం

రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. మొత్తం 12 శకటాలు పాల్గొన్న ఈ ప్రదర్శనలో, విద్యుత్ సంస్థ శకటం మొదటి స్థానం దక్కించుకుంది. వ్యవసాయం, ఉద్యానవన శాఖల శకటాలు రెండవ స్థానం, సాంఘిక సంక్షేమ శాఖ శకటం మూడవ స్థానం పొందాయి. అలాగే, పశు సంవర్థక శాఖ శకటం నాలుగవ స్థానం, పర్యాటక శాఖ శకటం ఐదవ స్థానం సాధించాయి.
News August 15, 2025
దుల్ల గ్రామంలో విషాద ఛాయలు

రామభద్రపురం వద్ద చెట్టు పడి <<17400517>>గురువారం<<>> మృతి చెందిన శ్రీనివాస్ స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా దుల్ల గ్రామంలో విషాదఛాయలు నెలకున్నాయి. శ్రీనివాస్కు వివాహం అయి రెండేళ్లయింది. డెక్కన్ ఫ్యాక్టరీలో ఉద్యోగం రావడంతో భార్యతో కలిసి తునిలో నివాసం ఉంటున్నాడు. శ్రీనివాస్ తల్లిదండ్రులకు ఇద్దరు ఆడపిల్లలు, ఇతను ఒక్కడే కుమారుడు. ఉద్యోగానికి వెళ్లి విగతజీవిగా మారిన కుమారుడ్ని చూసి వారు కన్నీరు మున్నీరువుతున్నారు.