News April 13, 2025

జలపాతంలో పూర్ణామార్కెట్ యువకులు గల్లంతు

image

అనకాపల్లి జిల్లా సరిహద్దులోని సరియా జలపాతంలో ఆదివారం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. విశాఖ పూర్ణ మార్కెట్‌కు చెందిన ఆరుగురు స్నేహితులు జలపాతం చూసేందుకు రాగా, వారిలో ఇద్దరు జలపాతంలో గల్లంతయ్యారు. దేవరాపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు ఇద్దరు యువకులు వెళ్ళగా.. ఘటనా ప్రదేశం అనంతగిరి పీఎస్ లిమిట్స్‌లో ఉందని తెలుసుకుని అక్కడ ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 12, 2025

విశాఖ: డిజిటల్ మోసం కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్

image

విశాఖలో ఓ వృద్ధుడిని డిజిటల్ అరెస్టు పేరిట మోసం చేసి రూ.1.60 కోట్లు కాజేసిన కేసులో ప్రధాన నిందితుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేయగా ప్రధాన నిందితుడు యూపీలోని బరేలి ప్రాంతానికి చెందిన ఆకాష్ యాదవ్‌ను అరెస్టు చేసి రిమండ్‌కి తరలించినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. జూన్ 24న బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

News September 12, 2025

విశాఖ: ‘మందుల విక్రయాలు జాగ్రత్తగా నిర్వహించాలి’

image

విశాఖలోని VMRDA చిల్డ్రన్స్ ఏరినాలో డ్రగ్ కంట్రోలర్ ఆధ్వర్యంలో మందుల దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. ఆకస్మిక తనిఖీలు జరుగుతాయని ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీ బయోటిక్స్ విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్ కంట్రోలర్ విజయకుమార్ హెచ్చరించారు. సమావేశంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ స్వర్ణలత పాల్గొని డ్రగ్స్ పై వివరించారు.

News September 12, 2025

విశాఖ: నెల రోజుల పాటు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు

image

జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం చేపడుతున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో గోడ పత్రిక ఆవిష్కరించారు. జిల్లాలో 58 వేల పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేస్తామన్నారు. రైతులు పశువులన్నింటికీ టీకాలు వేయించుకోవాలని కోరారు.