News April 2, 2026
జలమండలిలో ‘మీటర్’ మాయ.. రూ.200 కోట్ల దోపిడీ!

జలమండలి ఆదాయానికి లైన్మెన్లు భారీ గండి కొడుతున్నారు. నగరంలో 80% కనెక్షన్లకు మీటర్లు పనిచేయకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, కమర్షియల్ భవనాల నుంచి అనధికార వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. 2024-25 ఆడిట్ ప్రకారం ‘నాన్-రెవెన్యూ వాటర్’ లెక్కలు 50% దాటడం గమనార్హం. దీనివల్ల ఏటా రూ.200 కోట్ల ఆదాయం గాలిలో కలిసిపోతోంది. అవినీతికి పాల్పడుతున్న క్షేత్రస్థాయి సిబ్బందిపై వేటు వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
Similar News
News April 20, 2026
కొడంగల్: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.
News April 20, 2026
కొడంగల్: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.
News April 20, 2026
HYDలో త్వరలో మరో IVF సెంటర్

HYD హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులోకి రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. సుమారుగా 490 పడకల సామర్థ్యంతో, డాక్టర్లతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయడం, పసిపిల్లలకు వైద్యం, పిల్లల తల్లులకు అడ్వాన్స్డ్ వైద్యం అందించనున్నారు.


