News August 17, 2024
జలుమూరు: దర్యాప్తునకు హాజరు కావాలని దివ్యాంగులకు నోటీసులు
జలుమూరు మండలం సైరిగాం పంచాయతీలో పలువురు నకిలీ దివ్యాంగ ధ్రువపత్రాలతో పింఛను పొందుతున్నారని గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదుపై అధికారులు చర్యలు చేపట్టారు. ఈనెల 20న శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో సదరం ధ్రువపత్రాల నిర్ధారణకు హాజరు కావాలని 33 మంది పింఛనుదారులకు నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీవో పి.ఉమామహేశ్వరరావు శుక్రవారం తెలిపారు. దర్యాప్తునకు హాజరు కాకపోతే అనర్హులుగా గుర్తించి పింఛన్లు తొలగిస్తామన్నారు.
Similar News
News October 7, 2024
శ్రీకాకుళం: 129 అర్జీలు స్వీకరించిన కలెక్టర్
జిల్లా అధికారులు హాజరు తప్పనిసరిగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అర్జీదారుల నుంచి 129 అర్జీలు స్వీకరించమన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీలు పరిష్కారంలో అలసత్వం వహించరాదని సూచించారు. ఎప్పటి అర్జీలు అప్పుడే పరిష్కరించాలని ఆదేశించారు. బాధ్యతగా పనిచేయాలన్నారు.
News October 7, 2024
SKLM: 51 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ
ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి, చట్ట పరిధిలో త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఎస్పీ మహేశ్వర రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. సకాలంలో బాధితులకు న్యాయం చేయాలని, సంతృప్తి చెందేలా ఫిర్యాదులు పరిష్కరించాలన్నారు. సోమవారం శ్రీకాకుళంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో 51 ఫిర్యాదులు స్వీకరించమని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించరాదన్నారు.
News October 7, 2024
SKLM: జిల్లా పంచాయతీ అధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరణ
జిల్లా పంచాయతీ అధికారిగా కె. భారతి సౌజన్య సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈమె కాకినాడ డీపీఓ గా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ముందుగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను కలుసుకున్నారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.