News April 22, 2025
జలుమూరు: నాడు IPS.. నేడు IAS

జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన బాన్న వెంకటేశ్ 2023 సర్వీసెస్ ఫలితాలలో 467 ర్యాంక్ సాధించి IPSకు ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్లో శిక్షణ పొందుతున్నాడు. అయితే IAS కావాలనే సంకల్పంతో వెంకటేశ్ మళ్లీ సివిల్స్ పరీక్షలు రాశాడు. మంగళవారం విడుదలైన సర్వీసెస్ ఫలితాలలో 15వ ర్యాంక్తో ఐఏఎస్ సాధించాడు. దీంతో వెంకటేశ్ తల్లిదండ్రులు చందర్రావు, రోహిణి అనందం వ్యక్తం చేశారు. వెంకటేశ్ని పలువురు అభినందించారు.
Similar News
News February 14, 2026
సిక్కోలు ‘సిద్ధమైంది’

మహా శివరాత్రి ఉత్సవాలకు శ్రీకాకుళం జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. జిల్లాలోని శ్రీముఖలింగం(ముఖలింగేశ్వర స్వామి), శ్రీకాకుళం(ఉమారుద్ర కోటేశ్వరస్వామి),రావివలస(ఎండల మల్లికార్జునస్వామి), పలాస(స్వయంభూ లింగేశ్వరస్వామి), పాతపట్నం(నీలకంటేశ్వర స్వామి) ఆలయాల్లో ఆదివారం భక్తుల రద్దీ ఏర్పడనుంది. దీంతో ఆయా ఆలయాల వద్ద భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
News February 14, 2026
అందాల పోటీల్లో మెరిసిన శ్రీకాకుళం యువతి

హైదరాబాద్ వేదికగా ఐఎల్ఎహెచ్ఇ మోడలింగ్ అండ్ ఫినిషింగ్ స్కూల్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మిస్ గ్రాండ్ ఆంధ్రప్రదేశ్ పోటీల్లో శ్రీకాకుళం పట్టణానికి చెందిన మేఘన మెరిసింది. సెకండ్ రన్ రప్పుగా నిలిచి సత్తా చాటింది. మోడలింగ్పై ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చినట్లు ఆమె చెప్పారు. పలువురు ఈ యువతిని అభినందించారు.
News February 14, 2026
శ్రీముఖలింగేశ్వరుని ఉత్సావాల కార్యక్రమాలివే!

శ్రీముఖలింగం దేవాలయం మహా శివరాత్రి వేడుకలకు ముస్తాబు అయింది . ఈనెల15-18 వరకు వేడుకలు జరగనున్నట్లు దేవాదాయ శాఖాధికారులు చెప్పిన విషయం తెలిసిందే. ఆలయంలో 15న మహాశివరాత్రి జాగారం, 16న పడియా, 17న మహా పడియా, 18న వంశధార నదిలో శ్రీముకలింగేశ్వరుని చక్రతీర్థ స్నానాలు జరగనున్నాయి. లక్షలాది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉత్సావాలు విజయవంతమయ్యేలా ఏర్పాట్లను యంత్రాంగం చేపట్టింది.


