News February 3, 2026

జల్‌జీవన్ మిషన్‌ నిధులు నిలిపివేత

image

జల్‌జీవన్ మిషన్లో మిగిలిన పనులకు నిధులు నిలిపివేస్తున్నట్లు కేంద్రం రాజ్యసభలో ప్రకటించింది. 2019లో చేపట్టిన ఈ స్కీమ్‌లో ₹2.08 ల‌క్ష‌ల CR 2024-25కే ఖర్చయి 81.5% పనులే పూర్తయ్యాయి. పలు రాష్ట్రాల్లో అక్రమాలు గుర్తించిన కేంద్రం మిగతా పనులకు నిధులు రాష్ట్రాలే భరించాలని స్పష్టం చేసింది. FY26-27కు కేటాయించిన ₹67,670 CR నిర్వహణకు ఇవ్వనుంది. కాగా APలో రూ.23వేల కోట్ల పనులకు ఇటీవలే కేంద్రం ఆమోదం తెలిపింది.

Similar News

News February 4, 2026

రుతుక్రమంపై ప్రభావం చూపుతున్న వాతావరణ మార్పులు

image

వాతావరణమార్పులతో రుతుక్రమం ప్రభావితం అవుతున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. బంగ్లాదేశ్‌లోని పలు విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు 1992-93, 2019-21 సంవత్సరాల్లో జనాభా, ఆరోగ్య సర్వేలు, నాసా వాతావరణ డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో శారీరక ఒత్తిడి పెరిగి హర్మోన్లను నియంత్రిస్తోంది. తద్వారా ఉష్ణప్రాంతాల్లోని బాలికల్లో రుతుక్రమం ఆలస్యమవుతున్నట్లు గుర్తించారు.

News February 4, 2026

‘వారణాసి’ సీక్వెల్‌పై రాజమౌళి క్లారిటీ!

image

‘వారణాసి’ సినిమా గురించి దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమాకు సీక్వెల్ ఉండదని, సుమారు 3 గంటల నిడివితో సింగిల్ పార్ట్‌గానే వస్తుందని స్పష్టం చేశారు. రామాయణంలోని ఓ భాగాన్ని ఇందులో చూపించనున్నట్లు తెలిపారు. మహేశ్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, పృథ్వీరాజ్ విలన్‌గా కనిపించనున్నారు. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్, వచ్చే ఏడాది APR 7న పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల కానుంది.

News February 4, 2026

ఒక్క రోజే రూ.20వేలు పెరిగిన కేజీ సిల్వర్

image

నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కేజీ సిల్వర్ రేటు రూ.20,000 పెరిగి రూ.3,20,000 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇదే రేటు కొనసాగుతోంది. అటు బంగారం ధరలు కూడా ఇవాళ <<19045966>>భారీగా పెరిగిన<<>> విషయం తెలిసిందే.