News April 30, 2024

జహీరాబాద్‌లో నియోజకవర్గంలో మహిళలే అధికం

image

జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం విడుదలైన తుది జాబితా ప్రకారం మొత్తం 16,40,755 మంది ఓటర్లు ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు 53వేల ఓటర్లు మాత్రమే పెరిగారు. 2019 నుంచి 24 మధ్య 1,45,912 మంది పెరిగినట్లు అధికారుల వెల్లడించారు. పెరిగిన ఓటర్లలో మహిళల సంఖ్యే అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Similar News

News October 31, 2025

ఎకరానికి రూ.50 వేల పరిహారం ఇవ్వాలి: కవిత

image

భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి, రైతన్నల ఆరుగాలం కష్టం నీటిపాలైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వాలని ఆమె కోరారు. ఎకరాకు రూ.10 వేల సాయం సరిపోదని, ఒక్కో ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని కవిత ట్వీట్ చేశారు.

News October 30, 2025

రంగు మారిన ధాన్యాన్ని వెంటనే సేకరించాలి: ఎమ్మెల్యేలు

image

అకాల వర్షాలకు రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్, రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. తడిసిన వరి ధాన్యాన్ని తేమ చూడకుండా బాయిల్డ్ రైస్ మిల్లర్లకు తరలించి రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేలు కోరారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వర్షాలతో ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు.

News October 30, 2025

NZB: నీలకంఠేశ్వరుడి సేవలో కలెక్టర్ దంపతులు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ నీలకంఠేశ్వరాలయంలో కలెక్టర్ వినయ్‌కృష్ణా రెడ్డి దంపతులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈఓ శ్రీరాం రవీందర్ తెలిపారు. ఆలయానికి వచ్చిన కలెక్టర్ దంపతులు స్వామివారికి అభిషేకాలు, హారతి, మొదలగు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కలెక్టర్ దంపతులను శేషవస్త్రముతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ ఛైర్మన్ సిరిగిరి తిరుపతి ఉన్నారు.