News March 30, 2025
జహీరాబాద్లో మహిళ దారుణ హత్య

మహిళ దారుణహత్యకు గురైన ఘటన జహీరాబాద్ పట్టణం పస్తాపూర్లో ఆదివారం జరిగింది. పోలీసుల వివరాలు.. మహిళ కళ్లల్లో కారం చల్లి దారుణ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు ఝరాసంగం మండలం చీల మామిడికి చెందిన లక్ష్మి (55)గా గుర్తించారు. ఘటన స్థలాన్ని డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి సందర్శించి హత్యకు గల కారణాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కాశీనాథ్ తెలిపారు.
Similar News
News September 17, 2025
ఖమ్మం: పరీక్షా కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ యాక్ట్ అమలు

ఈ నెల 22 నుంచి 29 వరకు ఖమ్మం కమిషనరేట్ పరిధిలో జరిగే పదో తరగతి, ఇంటర్మీడియట్ (టీఓఎస్ఎస్) పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు అమల్లో ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురుకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News September 17, 2025
పోరాటాల గడ్డ కొత్తగూడెం

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తుంగతుర్తి మండలం కొత్తగూడెం కీలక పాత్ర పోషించింది. భీంరెడ్డి నర్సింహారెడ్డి నిజాం సైన్యంపై అలుపెరుగని పోరాటం చేశారు. నిజాం సైన్యంతో పాటు రజాకార్లు అరాచకాలు చేస్తూ ప్రజలను పీడిస్తుండగా భీంరెడ్డి నర్సింహారెడ్డి, ఆయన సోదరి మల్లు స్వరాజ్యం, వెంపటికి చెందిన దాయం రాజిరెడ్డి చుట్టూ ఉన్న గ్రామస్థులలో కలిసి దళాలు ఏర్పాటు చేసి సైన్యంతో తలపడ్డారు.
News September 17, 2025
తుంగతుర్తి: మల్లు స్వరాజ్యం మాటే తూటాలు

పదహారేళ్ల వయసులోనే తుపాకీ పట్టి దొరలపై తిరుగుబాటు చేసిన వీర వనిత మల్లు స్వరాజ్యం. ఆమె తన సోదరుడు భీంరెడ్డి నర్సింహారెడ్డితో కలిసి సాయుధ పోరాటంలో దిగారు. నైజాం సర్కారును గడగడలాడించారు. సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం మాటలు, ఆమె పాడిన బతుకమ్మ పాటలే తూటాలై పేలాయి. నైజాములను గడగడలాడించినయి. ఆమె స్ఫూర్తితో ఎంతో మంది ధీర వనితలు పోరాటంలో నడుం బిగించారు.