News March 30, 2025

జహీరాబాద్‌లో మహిళ దారుణ హత్య

image

మహిళ దారుణహత్యకు గురైన ఘటన జహీరాబాద్ పట్టణం పస్తాపూర్‌లో ఆదివారం జరిగింది. పోలీసుల వివరాలు.. మహిళ కళ్లల్లో కారం చల్లి దారుణ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు ఝరాసంగం మండలం చీల మామిడికి చెందిన లక్ష్మి (55)గా గుర్తించారు. ఘటన స్థలాన్ని డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి సందర్శించి హత్యకు గల కారణాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కాశీనాథ్ తెలిపారు.

Similar News

News April 1, 2025

మెదక్: పోలీసు యాక్ట్ అమలు: ఎస్పీ

image

మెదక్ జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ మాసం మొత్తం జిల్లా వ్యాప్తంగా 30, 30(ఏ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లాలో ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు.

News March 31, 2025

UPDATE: చెరువులో దూకిన వ్యక్తి శవం లభ్యం

image

తూప్రాన్ పట్టణంలోని మ్యాడక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి శవం లభించినట్లు పోలీసులు తెలిపారు. పట్టణానికి చెందిన దాసరి యాదగిరి(40) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఆదివారం సాయంత్రం ఉగాది సందర్భంగా మద్యం తాగి ఇంటికి రావడంతో భార్య గొడవ పడింది. దీంతో మనస్తాపం చెందిన యాదగిరి సమీపంలో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గాలింపు చేపట్టగా సోమవారం శవం లభించింది.

News March 31, 2025

మెదక్ జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి

image

మెదక్ జిల్లాలోని గడిచినా 24 గంటల్లో పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్ 40.8, వెల్దుర్తి 40.7, మాసాయిపేట 40.6, కుల్చారం 40.5, కౌడిపల్లి, చేగుంట 40.4, శివ్వంపేట 40.3, పెద్ద శంకరంపేట్ 40.2, రేగోడ్, నిజాంపేట్ 40.1, అల్లాదుర్గ్ 39.8, నర్సాపూర్ 39.4, రామాయంపేట, టేక్మాల్ హవేలిఘనపూర్ 39.1 పాపాన్నపేట్ 39.0°, మనోహరాబాద్ 38.9 C, గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

error: Content is protected !!