News March 16, 2025

జహీరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

image

జహీరాబాద్ మండలం హుగ్గెల్లీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బసవ కళ్యాన్ వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ప్రదీప్(22) అక్కడికక్కడే మృతి చెందాడు. అతని చెల్లెలు ఆశ(18) తీవ్రంగా గాయపడగా చికిత్స కోసం బీదర్ దవాఖానకు తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రదీప్ మృతదేహం ప్రస్తుతం ప్రభుత్వ దవాఖాన మార్చురీలో ఉంది.

Similar News

News March 17, 2025

మాకవరపాలెం: బావిలో దూకి యువకుడి ఆత్మహత్య

image

మాకవరపాలెం మండలం చామంతిపురంలో ఒక యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన దుంగల దుర్గాప్రసాద్(17) ఆదివారం సాయంత్రం గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న మాకవరపాలెం ఎస్ఐ దామోదర్ నాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేశారు.

News March 17, 2025

కామారెడ్డి: భార్యని చంపిన భర్త

image

అనుమానంతో భార్యని చంపాడో భర్త. ఈ ఘటన HYDలోని అంబర్‌పేట్‌లో జరిగింది. పోలీసుల వివరాలు.. కామారెడ్డి (D) దోమకొండ (M) అంబర్‌పేటకు చెందిన నవీన్‌కు బీబీపేట్(M)కు చెందిన రేఖ(27)తో పెళ్లైంది. వీరు HYDలో అంబర్‌పేట్‌లో నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన నవీన్‌ భార్య ప్రవర్తనపై అనుమానంతో ఈనెల 10న పెట్రోల్ పోసి నిప్పంటించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. రేఖ తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

News March 17, 2025

పల్నాడు జిల్లాలో పలువురు పోలిస్ సిబ్బంది బదిలీలు

image

పల్నాడు జిల్లాలో పలువురు పోలీసు సిబ్బందిని బదిలీలు చేస్తూ ఎస్పీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో వివిధ పోలిస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పలువురు ఎఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లను బదిలీలు చేస్తూ ఉత్తర్వులిచ్చారు.  అదే విధంగా పలువురు స్పెషల్ బ్రాంచ్ సిబ్బందిని బదిలీలు చేస్తూ, పోస్టింగ్స్ ఇచ్చారు. 

error: Content is protected !!