News March 16, 2025

జహీరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

image

జహీరాబాద్ మండలం హుగ్గెల్లీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బసవ కళ్యాన్ వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ప్రదీప్(22) అక్కడికక్కడే మృతి చెందాడు. అతని చెల్లెలు ఆశ(18) తీవ్రంగా గాయపడగా చికిత్స కోసం బీదర్ దవాఖానకు తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రదీప్ మృతదేహం ప్రస్తుతం ప్రభుత్వ దవాఖాన మార్చురీలో ఉంది.

Similar News

News September 18, 2025

రాష్ట్రంలో 21 పోస్టులు

image

<>ఏపీపీఎస్సీ<<>> 21 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో డ్రాట్స్‌మెన్ గ్రేడ్ 2, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్, హార్టికల్చర్ ఆఫీసర్, జూనియర్ లెక్చరర్(లైబ్రరీ సైన్స్), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 8వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.370. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

News September 18, 2025

HNK: కొడుకును సమర్థించారు.. కటకటాల పాలయ్యారు!

image

హనుమకొండ జిల్లా వేలేరు మండలానికి చెందిన తరుణ్, రాజులు ఓ గ్రామానికి చెందిన బాలికకు సైగలు చేస్తూ వేధించేవారు. నిందితుల తల్లిదండ్రులకు చెప్పగా వారి కొడుకులను సమర్థించారు. దీంతో బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో సమ్మయ్య, ఇందిరమ్మలతో కలిపి నలుగురిపై పోక్సో కేసు నమోదైంది. మూడేళ్ల జైలు, రూ.12వేల జరిమానా వేస్తూ HNK జిల్లా మొదటి అదనపు సెషన్స్ జడ్జి అపర్ణ దేవి తీర్పు ఇచ్చారు.

News September 18, 2025

బాల్మర్ లారీలో ఉద్యోగాలు

image

<>బాల్మర్ లారీ<<>> 38 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇందులో అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్, జూనియర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. గరిష్ఠ వయోపరిమితి 40ఏళ్లు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.