News March 7, 2025
జహీరాబాద్లో విషాదం.. పొలంలో విద్యుత్ షాక్తో అన్నదమ్ములు మృతి

జహీరాబాద్ మండలం గోవింద్పూర్ గ్రామంలో గురువారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. పొలంలో ప్రమాదవశత్తు విద్యుత్ షాక్కు గురై మధుగొండ జగన్, మల్లేష్ అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, సంబంధిత అధికారులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గత సంవత్సరం ఇదే కుటుంబానికి చెందిన తండ్రి నాగన్న పాము కాటుకు గురై మరణించడం గమనార్హం.
Similar News
News March 7, 2025
MBNR: 25% రాయితీ పొందండి: స్పెషల్ కలెక్టర్

ఈ నెలాఖరులోగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించుకొని ప్రభుత్వం కల్పించిన 25% శాతం రాయితీని పొందాల్సిందిగా స్పెషల్ కలెక్టర్ మున్సిపల్ ప్రత్యేక అధికారి శివేంద్ర ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. గురువారం మున్సిపల్ లో చేసిన ఎల్ఆర్ఎస్ హెల్ప్ లైన్ సెంటర్లను ఆయన పరిశీలించారు. పరిశీలించారు హెల్ప్ లైన్ సెంటర్ను సంప్రదించి తమ దరఖాస్తులను పరిష్కరించుకోవాల్సిందిగా కోరారు.
News March 7, 2025
కోనరావుపేటలో గుండెపోటుతో కార్మికుడి మృతి

కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన వడ్డెర కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన దుండగుల కనకయ్య(50) అనే కార్మికుడు బావుసాయి పేట గ్రామ శివారులో బండలు కొట్టడానికి వెళ్ళాడు. ఆ క్రమంలో చాతిలో నొప్పి రావడంతో సిరిసిల్ల ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య కనకవ్వ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
News March 7, 2025
ఇంగ్లండ్ కెప్టెన్గా బెన్ స్టోక్స్?

ఇంగ్లండ్ వన్డే జట్టు కెప్టెన్గా సీనియర్ ప్లేయర్ బెన్ స్టోక్స్ను నియమిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే టీ20 జట్టుకు హారీ బ్రూక్ను సారథిగా నియమిస్తారని వార్తలు వస్తున్నాయి. కాగా బెన్ స్టోక్స్ ఇప్పటికే వన్డేలకు రెండుసార్లు రిటైర్మెంట్ పలికారు. దీనిపై మరోసారి ఆయనతో ఈసీబీ చర్చలు జరుపుతుందని సమాచారం. కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఘోర ప్రదర్శన అనంతరం కెప్టెన్ పదవికి బట్లర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.