News April 14, 2024
జహీరాబాద్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ: మహాదేవ్ స్వామిజీ
ప్రజల సంక్షేమం కోసం జహీరాబాద్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు గాంధారి మండలం గుడిమెట్ మహాదేవ ఆలయ పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ తెలిపారు. ఆదివారం కామారెడ్డిలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత తరుణంలో స్వార్థ రాజకీయాల కోసం తప్ప ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకులు లేరన్నారు. ప్రజలు తనకు ఒకసారి అవకాశం కల్పించాలని కోరారు.
Similar News
News February 1, 2025
నిజామాబాద్ జిల్లా వెదర్ అప్డేట్@8AM
నిజామాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అత్యల్పంగా పోతంగల్లో 17℃, నిజామాబాద్ 17.1, మోస్రా 17.2, జకోరా 17.3, మోర్తాడ్ 17.4, యడపల్లి 17.5, సాలూరా 17.6, పల్డా, మల్లాపూర్ 17.7, గోపన్నపల్లి, ఏర్గట్ల, జానకంపేట్ 17.8, చందూర్ 17.9, మెండోరా, కొటగిరి, చిన్న మవంది, డిచ్పల్లి, చకొండూరు, కల్లూరి 18, లక్స్మాపూర్, బెల్లాల్, గన్నారం, నిజామాబాద్ పట్టణంలో 18.1℃గా నమోదయ్యాయి.
News February 1, 2025
రుద్రూర్: బట్టలు ఉతకడానికి వెళ్లి యువకుడి దుర్మరణం
రుద్రూర్ మండలం అక్బర్ నగర్ చెరువులో శుక్రవారం రాత్రి JNC కాలనీకి చెందిన సాజన్(36) అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. గురువారం సాయంత్రం బట్టలు ఉతకాడానికి బైక్ పై వెళ్లిన సాజన్ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతుకుతుండగా చెరువులో మృతదేహం లభించింది. ఎస్ఐ సాయన్న ఆధ్వర్యంలో మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు
News February 1, 2025
NZB: ఆదిత్య హృదయ స్తోత్ర పఠనంలో రికార్డు
ఆదిత్య హృదయ స్తోత్రం చదవడంలో నిజామాబాద్కు చెందిన సహాన్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు సాధించినట్లు తెలుగు వెలుగు సమాఖ్య కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. 31 శ్లోకాలు గల ఆదిత్య హృదయ స్తోత్రమును 2వ తరగతి చదువుతున్న సహాన్ కేవలం 3 నిమిషాలు 24 సెకన్లలో స్వర యుక్తంగా చదివి జాతీయ స్థాయి రికార్డు సాధించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 3న రైల్వే స్టేషన్ రోడ్డు గీత భవనంలో ఆశీర్వద సభ ఉంటుందన్నారు.