News April 1, 2025

జాగ్రత్త.. నంద్యాలలో భారీ చోరీ

image

నంద్యాల నగరంలోని క్రాంతి నగర్‌లో 2 రోజుల క్రితం భారీ చోరీ జరిగింది. నంద్యాల రూరల్ PS ఎస్‌ఐ గంగయ్య వివరాల ప్రకారం.. ట్రైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుభాన్ కుటుంబ సమేతంగా 2 రోజుల ముందు HYD వెళ్లారు. ఇది గమనించిన దొంగలు ఇదే అదునుగా చేసుకుని ఇంట్లో చొరబడి 6 తులాల బంగారం, అర్ధకేసీ వెండి, రూ.5.30 లక్షల నగదు చోరీ చేశారు. ఈ ఘటన మొత్తం CC కెమెరాలో రికార్డ్ కాగా ఇదంతా చెంచు గ్యాంగ్ పనని తేలింది.

Similar News

News April 2, 2025

నెల్లూరు: రైళ్లలో దోపిడీ దొంగల బీభత్సం

image

నెల్లూరు జిల్లాలో బిట్రగుంట-పడుగుపాడు రైల్వే స్టేషన్ల మధ్య దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టాలపై సాంకేతిక సమస్యను సృష్టించిన దొంగల ముఠా రెండు రైళ్లను ఆపి దోపిడీ చేసింది. అర్ధరాత్రి సమయంలో బెంగళూరు, చండీగఢ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపారు. బోగీల్లోకి ప్రవేశించి మహిళల మెడలోని బంగారం గొలుసులు, బ్యాగులను దోచుకెళ్లారు.

News April 2, 2025

ADB: వేధింపులా.. 8712659953కి కాల్ చేయండి: SP

image

మహిళలు, విద్యార్థినులకు ఉద్యోగస్థలాల్లో, కళాశాలల్లో ఎలాంటి సమస్యలున్నా, వేధింపులకు గురైనా జిల్లా షీ టీం బృందాలను సంప్రదించాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. షీ టీం బృందాలను సంప్రదించడానికి 24 గంటలు పని చేసేలా ఒక మొబైల్ నెంబర్ 8712659953ను ఏర్పాటుచేశామన్నారు. జిల్లాలో గత నెలల్లో 34 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఫిర్యాదులు అందిన వాటిలో 3 కేసులు, మావల పీఎస్‌లో ఒక FIR నమోదు చేసినట్లు చెప్పారు.

News April 2, 2025

ఆయిల్ పామ్ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

image

TG: రాష్ట్రవ్యాప్తంగా 45,548 మంది ఆయిల్ పామ్ రైతుల ఖాతాల్లో ప్రత్యేక సబ్సిడీ డబ్బులను జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇందుకోసం మొత్తం ₹72crను విడుదల చేశామన్నారు. సబ్సిడీ కింద ప్రభుత్వం ఎకరాకు ₹50వేలకు పైగా అందిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2.34 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అవుతోంది. 2023లో మార్చిలో టన్ను గెల ధర ₹14,174గా ఉండగా, ప్రస్తుతం ₹21,000కు చేరిందని మంత్రి తెలిపారు.

error: Content is protected !!