News March 15, 2025

జాతరేమో పరకాలలో.. రాజకీయమంతా నర్సంపేటలో..!

image

గీసుకొండ మండలం కొమ్మాల జాతర పాలన పరంగా పరకాల నియోజకవర్గంలో ఉంటుంది. కానీ ఈ జాతర ప్రభావం రాజకీయంగా నర్సంపేట నియోజకవర్గంలోనే ఎక్కువగా జరుగుతోంది. జాతరకు నెల రోజుల ముందు నుంచే దుగ్గొండి, నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి మండలాల్లో రాజకీయ పార్టీల నేతలు ప్రభ బండ్లను కడుతారు. ఏటా ఈ ప్రభ బండ్ల విషయంలో నర్సంపేటలో రాజకీయ గొడవలు జరుగుతూనే ఉంటాయి. పోలీసులకు జాతర అగ్ని పరీక్షలా మారుతోంది.

Similar News

News December 18, 2025

అమరావతిలో కలెక్టర్ల సదస్సుకు అనకాపల్లి కలెక్టర్, ఎస్పీ హాజరు

image

అమరావతి సచివాలయంలో గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన 5వ కలెక్టర్ల సదస్సులో జిల్లా కలెక్టర్ విజయక్రిష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా పాల్గొన్నారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి పనులు,మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పథకాల అమలుపై కలెక్టర్ వివరించారు. శాంతిభద్రతలు, గంజాయి నిర్మూలన, నేర నియంత్రణ చర్యలను ఎస్పీ తెలియజేశారు. పరిశ్రమల భద్రత, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని దృష్టి నిర్ణయించారు.

News December 18, 2025

MDK: ‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

image

ఈనెల 21న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డివి శ్రీనివాసరావు కోరారు. లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన, తక్కువ ఖర్చుతో ఇరువైపుల సమ్మతితో సమస్యలను పరిష్కరించుకునే అవకాశం అందుబాటులో ఉంటుందని తెలిపారు. రాజీ చేసుకునే అవకాశం ఉన్న వివిధ రకాల కేసులను రాజీ చేసుకోవాలని సూచించారు.

News December 18, 2025

ధాన్యం కొనుగోలు పురోగతిపై జేసీ సమీక్ష

image

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా పూర్తి చేయడానికి అధికారులు కృషి చేయాలని జేసీ రాహుల్ అన్నారు. జేసి ఛాంబర్‌లో గురువారం ధాన్యం కొనుగోలు పురోగతిపై అధికారులతో మండలాల వారీగా సమీక్షించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పురోగతిపై ధాన్యం సేకరణ కేంద్రాలు పనితీరు, రైతులు చెల్లింపులు లక్ష్యాలు, సాధనపై అడిగి తెలుసుకున్నారు.