News April 11, 2025

జాతీయస్థాయి పోటీల్లో మెరిసిన భద్రాద్రి విద్యార్థిని 

image

మాచిరాజు బాల సాహిత్య పీఠం ప్రతిష్టాత్మకంగా జాతీయ స్థాయిలో బాలల కథల పోటీ -2025 నిర్వహించారు. ఈ పోటీల్లో జూలూరుపాడు మండలం పాపకొల్లు జడ్పీ హైస్కూల్ 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని భూక్య వర్షితకు ద్వితీయ బహుమతి లభించింది. జాతీయ స్థాయి పోటీల్లో వచ్చిన 541 కథల్లో వర్షిత రాసిన ‘జంక్ ఫుడ్ తింటే’ అనే కథ ద్వితీయ స్థానంలో నిలిచి జిల్లా పేరు మారు మోగేలా చేసింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు.

Similar News

News September 13, 2025

ఆమిర్ ఖాన్ తనయుడి సినిమాలో సాయిపల్లవి

image

సౌత్ హీరోయిన్ సాయిపల్లవి బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్‌తో ఓ సినిమా చేస్తున్నారు. సునీల్ పాండే డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి తొలుత ‘ఏక్ దిన్’ అనే టైటిల్‌ను అనుకున్నారు. తాజాగా దానిని ‘మేరే రహో’గా మార్చారు. ఈ మూవీని నవంబర్ 7న రిలీజ్ చేయాల్సి ఉండగా డిసెంబర్ 12కు వాయిదా వేశారు. ఇది సాయిపల్లవికి హిందీలో డెబ్యూ మూవీ కానుంది. ఆమె రణ్‌బీర్ ‘రామాయణ’ మూవీలోనూ నటిస్తున్నారు.

News September 13, 2025

NGKL: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

image

ఈగలపెంట పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సల్వాది బాలయ్య గుండెపోటుతో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలయ్య అచ్చంపేట మండలం సింగారం గ్రామానికి చెందిన వ్యక్తి. అచ్చంపేట, సిద్దాపూర్, ఆమనగల్, మహబూబ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాలయ్య మృతి పట్ల తోటి పోలీసు సిబ్బంది సంతాపాన్ని వ్యక్తం చేశారు.

News September 13, 2025

ప్రొద్దుటూరు: టీవీ చూడొద్దన్నందుకు ఆత్మహత్య

image

పనీపాటా లేకుండా పొద్దస్తమానం టీవీ చూస్తుంటే జీవనం ఎలా గడుస్తుందని తల్లి మందలించిందని కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రొద్దుటూరులో జరిగింది. 3వ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ వేణుగోపాల్ వివరాల మేరకు.. YMR కాలనీలో నివాసం ఉంటున్న హమాలి వర్కర్ రంగనాయకులు కుమారుడు మాణిక్యం శుక్రవారం ఉదయాన్నే టీవీ చూస్తుండటంతో తల్లి మందలించింది. మనస్తాపం చెందిన మాణిక్యం(21) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.