News January 23, 2025
జాతీయ ఉత్తమ జర్నలిస్టుల అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్

ఉత్తమ జర్నలిస్టు జాతీయ పురస్కారాలు-2024 అవార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ కోరారు. వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా-2024 సంవత్సరానికి పాత్రికేయ పురస్కారాలు అందించేందుకు ఈ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతిభావంతులైన జర్నలిస్టులను గుర్తించడంలో భాగంగా జాతీయస్థాయిలో ఉత్తమ జర్నలిస్టులను ఎంపిక చేసి జర్నలిజం విలువలను మరింత బలోపేతం చేస్తుందని కలెక్టర్ చెప్పారు.
Similar News
News March 14, 2025
సంప్రదాయాలు పాటిస్తూ హోళీ జరుపుకోవాలి: కలెక్టర్

సంప్రదాయాలను పాటిస్తూ జరుపుకోవాలని ప్రజలకు కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. సమానత్వానికి ప్రతీకని, ఈ రంగుల పండుగ సమాజంలో ఐక్యతను పెంపొందించేలా మారాలని, ఆనందంగా, భద్రతతో, జిల్లా ప్రజలు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా హోలీ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. హోలీ ఆడిన తదుపరి బావులు, వాగులు, చెరువులు, గోదావరిలో స్నానాలకు వెళ్ళొద్దని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.
News March 14, 2025
లింగంపేట: చెరువులో పడి మహిళ మృతి

చెరువులో పడి ఒక మహిళ మృతి చెందినట్లు లింగంపేట ఎస్ఐ వెంకట్రావు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. మంబోజీపేట గ్రామానికి చెందిన కాశవ్వ గత నాలుగు రోజుల క్రితం ఆసుపత్రికి వెళ్తానని ఇంట్లో చెప్పి వెళ్లిందన్నారు. ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో గాలించినట్లు తెలిపారు. గ్రామ శివారులోని చెరువులో ఆమె మృతదేహం లభించగా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
News March 14, 2025
సూర్యాపేట: మోదుగ పువ్వు.. చరిత్ర ఇదే..!

మోదుగ ఒక ఎర్రని పువ్వు. ఈ పువ్వులను అగ్నిపూలు అని పిలుస్తారు. ఇది ఫాబేసి కుటుంబంలో బుటియాప్ర జాతికి చెందిన పుష్పించే మొక్క. దీని శాస్త్రీయ నామం బుటియా మోనోస్పెర్మా. ఇది ఒక పెద్ద చెట్టులాగా పెరుగుతుంది. అందమైన ఎర్రని పూలు గుత్తులు గుత్తులుగా అందంగా పూస్తాయి. మోదుగ చెట్టును కింశుక వృక్షం అని కూడా అంటారు. ఈ పువ్వులు హొలీ పండగ సమయంలో వేపుగా పూస్తాయి.