News February 16, 2025

జాతీయ ఉపకార వేతనాలకు రాజుర బిడ్డలు ఎంపిక

image

లోకేశ్వరం మండలం రాజుర ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు నముల్ల మనోజ్, కుంట యశస్వి, ఆర్ష దేవిక జాతీయ ఉపకార వేతనాల్లో ఎంపికయ్యారని HM రేగుంట రాజేశ్వర్ తెలిపారు. స్కాలర్షిప్ పొందిన విద్యార్థులకు 8 నుంచి 12వ తరగతి వరకు ఏటా రూ.12 వేల నగదు అందుతుందని పేర్కొన్నారు.

Similar News

News July 10, 2025

జిల్లాలో అక్షరాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో అక్షరాంద్ర కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో అక్షరాంద్ర ఉల్లాస్-2 కార్యక్రమంపై జిల్లాస్థాయి అధికారులతో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. అక్షరాంద్ర కార్యక్రమం ద్వారా 1,00,586 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు.

News July 10, 2025

పెన్ పహాడ్: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

పెన్ పహాడ్ మండలం నాగులపాటి అన్నారంలో విద్యుత్ షాక్‌కు గురై చికిత్స పొందుతూ రైతు మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొంతగాని నాగయ్య (45) ట్రాన్స్ ఫార్మర్ ఆన్ చేస్తూ విద్యుత్ షాక్ తగలడంతో సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాగయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

News July 10, 2025

విశాఖ రైల్వే స్టేషన్‌లో త్వరలో క్యాప్సూల్ హోటల్

image

విశాఖ రైల్వే స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్ ఫారం మొదటి అంతస్తులో త్వరలో క్యాప్సూల్ హోటల్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నట్లు DRM లలిత్ బోహ్ర గురువారం తెలిపారు. మొత్తం 88 రూమ్‌లతో కలిగిన హోటల్లో ప్రత్యేకంగా 18 రూములు మహిళలకు మాత్రమే ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సింగిల్ బెడ్‌లు 3 గంటల వరకు రూ.200, 3-24 గంటల వరకు రూ.400, డబుల్ బెడ్‌లు 3 గంటల వరకు రూ.300, 3-24 గంటలకు రూ.600 అద్దె ఉంటుందన్నారు.