News February 16, 2025

జాతీయ ఉపకార వేతనాలకు రాజుర బిడ్డలు ఎంపిక

image

లోకేశ్వరం మండలం రాజుర ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు నముల్ల మనోజ్, కుంట యశస్వి, ఆర్ష దేవిక జాతీయ ఉపకార వేతనాల్లో ఎంపికయ్యారని HM రేగుంట రాజేశ్వర్ తెలిపారు. స్కాలర్షిప్ పొందిన విద్యార్థులకు 8 నుంచి 12వ తరగతి వరకు ఏటా రూ.12 వేల నగదు అందుతుందని పేర్కొన్నారు.

Similar News

News July 10, 2025

మేడిగడ్డ బ్యారేజీకి పెరుగుతున్న భారీ వరద

image

మేడిగడ్డ బ్యారేజీకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఉదయం 3 లక్షల క్యూసెక్కులుగా ఉన్న నీరు సాయంత్రం వరకు 6.9 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. వచ్చిన నీరును 85 గేట్లు ఓపెన్ చేసి అధికారులు గోదావరి నదికి వదులుతున్నారు. ప్రాణహిత నది నుంచి రాత్రి వరకు మరింత నీరు రానున్నట్లు తెలిపారు. బ్యారేజ్ వద్ద పోలీసులు 24 గంటలు గస్తీ కాస్తున్నారు.

News July 10, 2025

అమలాపురం: పేదరిక నిర్మూలనకు కలెక్టర్ ఆదేశం

image

అమలాపురంలోని కలెక్టరేట్‌లో గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘పీ4’ స్కీమ్ కింద గ్రామస్థాయి నుంచి పేదరిక నిర్మూలనకు కృషి చేయాలని కలెక్టర్ కోరారు. ‘జీరో పేదరికం’ సాధనకు అధికారులు కృషి చేయాలని విజయానంద్ దిశానిర్దేశం చేశారు. ‘బంగారు కుటుంబం’ ఎంపిక ద్వారా ఇది సాధ్యమేనని అధికారులు పేర్కొన్నారు.

News July 10, 2025

BREAKING: సిరిసిల్ల: నిరుద్యోగి ఆత్మహత్య

image

ఉద్యోగం రావడంలేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల గ్రామంలో ఈరోజు చోటుచేసుకుంది. ఎస్ఐ రమాకాంత్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన లోకం శ్రీకాంత్(25) ఉన్నత చదువులు చదువుకున్నాడు. ఉద్యోగం కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో నిరాశ చెందాడు. గురువారం గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. తల్లి మణెమ్మ ఫిర్యాదుతో కేసు నమోదైంది.