News January 25, 2025

జాతీయ ఓటరు దినోత్సవాన్ని జయప్రదం చేయండి: కలెక్టర్

image

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్ నుంచి స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ అవగాహన ర్యాలీలో జిల్లా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, ఆర్డీఓలు, సహాయ ఎన్నికల అధికారులు, తహశీల్దార్లు, జర్నలిస్టులు, ప్రజలు, విద్యార్థుల అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.

Similar News

News April 25, 2025

మెదక్: కొడుకుల చేతులు కోసి, తల్లి సూసైడ్

image

అత్తింటి వేధింపులు భరించలేక కొడుకులతో తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల వివరాలు.. గుమ్మడిదలకు చెందిన అహ్మద్, మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన రేష్మాబేగం(30)ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తున్నారు. తట్టుకోలేక కుమారుల చేతులపై కత్తితో గాయాలు చేసి, ఆమె ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు పిల్లలను అసుపత్రికి తరలించారు.

News April 25, 2025

నర్సాపూర్: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరి మృతి

image

నర్సాపూర్ మండలం రుస్తుంపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

News April 25, 2025

మెదక్: సైబర్ మోసగాళ్ల వలలో చిక్కిన యువతి

image

సైబర్ మోసగాళ్ల వలలో పడి యువతి డబ్బులు పోగొట్టుకున్న ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి రూ.1000 చెల్లిస్తే రూ.600 కమిషన్ వస్తుందని ఆమెను నమ్మించాడు. విడతల వారీగా రూ.1.28 లక్షలు చెల్లించిన యువతి తాను మోసపోయినట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!