News December 23, 2025

జాతీయ కరాటే పోటీల్లో భీమవరం విద్యార్థికి కాంస్యం

image

మధ్యప్రదేశ్లో జరిగిన 69వ జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్‌లో భీమవరం ఛాంపియన్ స్పోర్ట్స్ అకాడమీకి చెందిన ఎస్. ఆహిల్ సత్తా చాటారు. అండర్-14 విభాగంలో పాల్గొన్న ఈ క్రీడాకారుడు దేశవ్యాప్తంగా 3వ స్థానం సాధించి కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. ఏపీ నుంచి మొత్తం 21 మంది కరాటే పోటీలలో ప్రాతినిధ్యం వహించారు. ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహిస్తే అంతర్జాతీయ వేదికలపై మరిన్ని విజయాలు సాధించవచ్చని కోచ్ సుభాన్ అన్నారు.

Similar News

News December 25, 2025

ప.గో: ఆటవిడుపు విషాదాంతం.. నీటిలో విగతజీవిగా బాలుడు

image

పెనుగొండలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని పార్కులో గురువారం మధ్యాహ్నం ఆడుకుంటూ అదృశ్యమైన పదేళ్ల బాలుడు.. రాత్రికి సమీపంలోని చెరువులో విగతజీవిగా లభ్యమయ్యాడు. బాలుడి ఆచూకీ కోసం గాలించిన స్థానికులు, చెరువులో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

News December 25, 2025

గుండెపోటుతో మొగల్తూరు డిప్యూటీ ఎంపీడీఓ మృతి

image

మొగల్తూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల డిప్యూటీ ఎంపీడీఓ ముచ్చర్ల నాగేశ్వరరావు (చిన్నా) గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. నరసాపురంలో ఓ మెడికల్ షాపు వద్ద ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతితో మొగల్తూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News December 25, 2025

ఎస్.హెచ్.జీ మహిళల ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి: కలెక్టర్

image

స్వయం సహాయక సంఘాల మహిళలు నెలకొల్పిన ప్రాజెక్టుల అభివృద్ధిలో యువ విద్యార్థులు భాగస్వాములు కావాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. బుధవారం ఆమె అధికారులతో సమీక్షించారు. మహిళలు నడుపుతున్న చాక్లెట్ ఫ్యాక్టరీల ఉత్పత్తులకు వినూత్న మార్కెటింగ్, బ్రాండింగ్, ఆకర్షణీయమైన ప్యాకింగ్ బాక్సుల తయారీపై కొత్త ఆలోచనలతో ప్రాజెక్టులు రూపొందించాలని, తద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు మెరుగైన ఉపాధి లభిస్తుందన్నారు.